logo

గుర్తుతెలియని వాహనం ఢీకొని భర్త మృతి

సిద్ధయ్య.. సిద్ధవ్వ భార్యాభర్తలు. పేర్లు మాదిరే కలిసిమెలిసి జీవిస్తున్న వారు చావులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోవడం చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. అంతంపల్లికి చెందిన కర్రోళ్ల సిద్ధయ్య(48) శుక్రవారం సాయంత్రం

Published : 06 Aug 2022 06:02 IST

చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్య కూడా..

తీవ్ర గాయాలతో తమ్ముడి పరిస్థితి విషయం

భిక్కనూరు టోల్‌గేటు వద్ద తీవ్రంగా గాయపడ్డ సిద్ధవ్వ, లింగంను అసుపత్రికి త

రలిస్తున్న అంబులెన్సు సిబ్బంది

భిక్కనూరు, న్యూస్‌టుడే: సిద్ధయ్య.. సిద్ధవ్వ భార్యాభర్తలు. పేర్లు మాదిరే కలిసిమెలిసి జీవిస్తున్న వారు చావులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోవడం చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. అంతంపల్లికి చెందిన కర్రోళ్ల సిద్ధయ్య(48) శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య సిద్ధవ్వ, తమ్ముడు లింగం కన్నీరుమున్నీరవుతూ భిక్కనూరు నుంచి ద్విచక్రవాహనంపై సంఘటనా స్థలానికి వెళ్తుండగా కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్ధయ్య మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. రక్తమోడుతున్న వారిద్దరినీ అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ సిద్ధవ్వ కూడా మృతిచెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. లింగం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. సిద్ధయ్య, సిద్ధవ్వకు ఇద్దరు కుమారులు ఉన్నారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని