logo

నిత్య వ్యాయామం ఆరోగ్యకరం

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు.

Published : 05 Oct 2022 03:37 IST


ఇందిరాగాంధీ స్టేడియంలో జిమ్‌ను ప్రారంభిస్తున్న విప్‌ గోవర్ధన్‌

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం నూతన వ్యాయామశాల(జిమ్‌)ను ఆయన ప్రారంభించారు. దసరా నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఉదయం 6 - 9 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు వ్యాయామాలు చేసుకోవచ్చన్నారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఇందుప్రియ, రాష్ట్ర ఉర్దూ అకాడమి ఛైర్మన్‌ ముజీబుద్దిన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పున్న రాజేశ్వర్‌, ఎంపీపీ ఆంజనేయులు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావు, జూకంటి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని