నిత్య వ్యాయామం ఆరోగ్యకరం
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో జిమ్ను ప్రారంభిస్తున్న విప్ గోవర్ధన్
కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్టుడే: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం నూతన వ్యాయామశాల(జిమ్)ను ఆయన ప్రారంభించారు. దసరా నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఉదయం 6 - 9 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు వ్యాయామాలు చేసుకోవచ్చన్నారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ ఇందుప్రియ, రాష్ట్ర ఉర్దూ అకాడమి ఛైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ ఆంజనేయులు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్రెడ్డి, నిట్టు వేణుగోపాల్రావు, జూకంటి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్