logo

అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నా : ఎమ్మెల్యే

మండల కేంద్రలోని రైతు వేదికలో బుధవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే సురేందర్‌ పంపిణీ చేశారు.

Updated : 08 Dec 2022 17:29 IST

లింగంపేట : మండల కేంద్రలోని రైతు వేదికలో బుధవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే సురేందర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నానని, అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లే బాధితులకు దగ్గరుండి వైద్యం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోఅత్యధికంగా సీఎం సహాయనిధి చెక్కులు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చాయని తెలిపారు. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు. లింగంపేటలో సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, సర్పంచ్‌ లావణ్య, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు షముమున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని