అగ్నివీరుల ఆనందం
సైన్యంలో చేరి దేశాన్ని రక్షించే అవకాశం కొద్దిమందికే వస్తుంది. అంకితభావంతో పనిచేస్తూ సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది.
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్టుడే, నాగిరెడ్డిపేట, బీబీపేట
సైన్యంలో చేరి దేశాన్ని రక్షించే అవకాశం కొద్దిమందికే వస్తుంది. అంకితభావంతో పనిచేస్తూ సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారిని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం ఎంపిక విధానం మార్చిన నేపథ్యంలో అగ్నివీరులుగా మారాలంటే అంత సులువు కాదు. తొలిసారిగా నిర్వహించిన పరీక్షల్లో జిల్లాకు చెందిన యువత సత్తాచాటడంతో వారి కుటుంబాలు, గ్రామాల్లో సంతోషం నెలకొంది.
రెండేళ్లుగా నిరీక్షణ
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్మీ ప్రవేశ ర్యాలీల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం రెండేళ్లపాటు నిలిపివేసింది. సైన్యంలో చేరాలనుకునే వేలాది మంది యువత అసంతృప్తికి లోనయ్యారు. అర్హత సాధించేందుకు రాష్ట్ర రాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటూ శిక్షణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక విధానాన్ని మార్చి అగ్నివీరులుగా తీసుకుంటామని ప్రకటించింది. దీనిపట్ల వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అర్హత పరీక్షకు వేలాది మంది యువత హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
జిల్లాలో 40 మంది వరకు
పూర్వం ఆర్మీ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాంతం తిరుగుండేది కాదు. ప్రస్తుత విధానంలో అగ్నివీరులుగా ఎంపికైన వారు నాలుగేళ్లపాటు సేవలందించి ఉత్తమ ప్రతిభకనబరిస్తేనే సైన్యంలో కొనసాగుతారు. ఈ విధానంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన సంఘటనలో జిల్లాకు చెందిన యువకులు పాత్ర ఉందనే ఉద్దేశంతో పలువురిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల మధ్య జరిగిన పరీక్షలో జిల్లా నుంచి సుమారు 40 మంది యువకులు ఎంపికయ్యారు. నాగిరెడ్డిపేట మండలంలో నలుగురు, బీబీపేటలో ముగ్గురు, విలీన గ్రామం చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి పట్టణం నుంచి ముగ్గురు చొప్పున అర్హత సాధించారు.
దేశ సేవ చేసే అదృష్టం
- నవీన్కుమార్, జలాల్పూర్, నాగిరెడ్డిపేట
అగ్నివీర్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అదృష్టం లభించింది. ఆర్మీ నిబంధనల మేరకు ఉత్తమ ప్రతిభకనబరిచి సైన్యంలోకి ప్రవేశించాలనేది కోరిక. అంచెలంచెలుగా ఎదిగి జిల్లాకు పేరు తీసుకొస్తాను.
గర్వంగా ఉంది
- దుర్గయ్య, జలాల్పూర్, నాగిరెడ్డిపేట
తొలిసారిగా నిర్వహించిన అగ్నివీర్ పరీక్షలో అర్హత సాధించడం గర్వంగా ఉంది. మెరుగైన పనితీరుతో దేశానికి సేవలందించడమే నా ఆశయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!