టీకా వేయించారా?
కరోనా సృష్టించిన కల్లోలంతో ‘వ్యాధినిరోధక టీకా’ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. కొవిడ్ టీకాను పక్కనపెడితే పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు వారందరికీ వివిధ రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్ తప్పనిసరి.
క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే
ఆగస్టు 7 నుంచి మిషన్ ఇంద్రధనుష్
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
కరోనా సృష్టించిన కల్లోలంతో ‘వ్యాధినిరోధక టీకా’ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. కొవిడ్ టీకాను పక్కనపెడితే పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు వారందరికీ వివిధ రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్ తప్పనిసరి. గర్భిణులు సైతం విధిగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే టీకాలు తీసుకోకుండా మిగిలిన వారికోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘మిషన్ ఇంద్రధనుష్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7 నుంచి అక్టోబరు 14 వరకు మూడు విడతల్లో టీకాలు ఇవ్వనున్నారు.
చిన్నారులు, గర్భిణులు వంద శాతం వ్యాక్సినేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం జిల్లాలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరుగుతున్నారు. అందరి వివరాలు సేకరిస్తున్నారు. 16 ఏళ్లలోపు వారికి ఎన్ని టీకాలు వేయించారు? గర్భిణులకు వ్యాక్సినేషన్ జరిగిందా? తదితర వివరాలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.
చిన్నారుల్లో బీసీజీ, హెచ్బీ, ఓపీవీ జీరో, ఓపీవీ 1-3, రోటా వైరస్, పెంటావాలెంట్, ఐపీవీ, విటమిన్ ఏ తదితర టీకాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు టీటీ-1, టీటీఏ-2, టీటీ బూస్టర్ టీకాలు తీసుకోవాలి. ఇదివరకు తీసుకోని 16 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు మిషన్ ఇంద్రధనుష్లో సిబ్బంది సూచన మేరకు వేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మూడు విడతలుగా..
* వాస్తవానికి ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రిల్లో వ్యాక్సినేషన్ నిరంతరం కొనసాగుతోంది. అయినప్పటికీ.. వివిధ కారణాలతో 5-8 శాతం మంది పలు రకాల టీకాలు తీసుకోవట్లేదని తేలింది. ఇలాంటి వారి కోసం మూడు విడతలుగా టీకాలు వేయనున్నారు.
* మొదటి విడతగా ఆగస్టు 7 నుంచి 12వ తేదీ వరకు, రెండో విడతలో సెప్టెంబరు 11 నుంచి 16, మూడో విడతలో అక్టోబరు 9 నుంచి 14 వరకు టీకాలు ఇవ్వనున్నారు.
* ఆశావర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి తిరిగి ఇదివరకు తీసుకోని 16 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వనున్నారు.
యూ విన్ పోర్టల్లో నమోదు
మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా వ్యాక్సినేషన్ చేయాల్సిన వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం(యూఐపీ) యూవిన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పుడు ఎవరికి టీకా ఇచ్చారు? తిరిగి మళ్లీ ఎప్పుడు వేయాలి? తదితర వివరాలు పూర్తిగా యాప్లో నిక్షిప్తం కానున్నాయి. టీకా పొందిన వారు విధిగా ధ్రువపత్రం పొందే వెసులుబాటు ఉండనుంది. ఇదే అంశంపై జీజీహెచ్లోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ అధికారులు, సిబ్బంది శిక్షణకు హాజరయ్యారు.
ప్రజలంతా సహకరించాలి
- సుదర్శనం, జిల్లా వైద్యాధికారి, నిజామాబాద్
మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తున్నారు. ప్రజలు పూర్తి వివరాలు తెలియజేయాలి. టీకాలు తీసుకోని వారిని గుర్తించి మూడు విడతల్లో వ్యాక్సినేషన్ చేస్తాం. ఇవి తప్పనిసరి. మా సిబ్బందికి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెరపైకి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
[ 17-05-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. -
కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
[ 17-05-2024]
జిల్లాలో వరి కోతలు మొదలై నెలరోజులైనా కొనుగోళ్లు పూర్తికావడం లేదు. హమాలీలు, సంచుల కొరత లేనప్పటికీ లారీలు లేక రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణకు రైసుమిల్లర్లు ససేమిరా అంటున్నారు. -
ఎత్తుకు పై ఎత్తులు
[ 17-05-2024]
ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాసకు చెందిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. -
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
[ 17-05-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
తక్కువ చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సులు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పెరిగిన వినియోగం.. తగ్గిన లబ్ధిదారులు
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్కార్డు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసి శూన్య బిల్లులు అందజేస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. -
వేసవి శిక్షణ.. లక్ష్యసాధన
[ 17-05-2024]
వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ చిన్నారులు తమలోని అంతర్గత ప్రతిభకు పదును పెడుతున్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ.. తమకు ఇష్టమైన రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్నారు. -
విభిన్న కోర్సుల ప్రత్యేకం
[ 17-05-2024]
ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. 158 ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది. -
మొబైల్ ‘దోస్త్’తో సులభం
[ 17-05-2024]
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇదివరకే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మొబైల్లో దోస్త్ ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. -
సెర్చ్ కమిటీ ఏర్పాటు
[ 17-05-2024]
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నూతన ఉపకులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్
[ 17-05-2024]
అనుమతి లేని లేఅవుట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయటాన్ని కట్టడి చేయటంపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా రూపొందిన దస్తావేజుల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
చరవాణి కోసం.. రైలు నుంచి దూకి
[ 17-05-2024]
ప్రాణం కంటే చరవాణి విలువైనది అనుకున్నాడేమో ఆ యువకుడు రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ కిందపడిపోవడంతో ఒక్కసారిగా దూకి తీవ్రగాయాలపాలయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!