logo

ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

ట్రాక్టర్‌ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.

Published : 19 Apr 2024 05:22 IST

  స్వాధీనం చేసుకున్న వాహనాలతో ఏఎస్సై షకీల్‌ అహ్మద్‌

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : ట్రాక్టర్‌ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీచౌక్‌లో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఆనంద్‌నగర్‌కు చెందిన సూదం మాదవ్‌(23) అనుమానాస్పదంగా కనిపించాడు. పట్టుకుని విచారించగా ఖలీల్‌వాడిలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిలిపి ఉంచిన మూడు ద్విచక్రవాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి వాటిని స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించామని ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. ఏఎస్సై షకీల్‌ అహ్మద్‌ కృషితోనే నిందితుడిని త్వరగా పట్టుకున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని