logo

కాంగ్రెస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 01 May 2024 12:39 IST

నాగిరెడ్డి పేట:  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ ఆధ్యర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని  జలాల్పుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.  6 గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేసినట్లు ఆయన తెలిపారు.  ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మండల  సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, వాసు రెడ్డి, గంగా రెడ్డి, విఠల్, శ్రీనివాస్ గౌడ్, నర్సింహ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని