logo

బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్‌

బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెలిపారు.

Published : 01 May 2024 04:55 IST

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా కుట్ర చేస్తోందన్నారు. దేశంలో కుల గణన చేపట్టాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తుంటే భాజపా అంగీకరించడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా బడా వ్యాపారుల అప్పులు మాఫీ చేస్తోందని ఆరోపించారు. ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. సమాజాన్ని విడదీసి, మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతోందన్నారు. మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలో ఇండియా కూటమి విజయం తథ్యమన్నారు. కవిత, అర్వింద్‌ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తుంటే మహిళలు తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. నీతి నిజాయతీగా ఉండే జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌, నగర అధ్యక్షుడు కేశ వేణు, గడుగు గంగాధర్‌, రత్నాకర్‌, రాజేంద్ర ప్రసాద్‌, భక్తవత్సలం, జావిద్‌ అక్రం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని