పదిలో కాస్త తడబడి
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది.
రాష్ట్రస్థాయిలో జిల్లాకు 19వ స్థానం
92.71 శాతం ఉత్తీర్ణత.. 132 మందికి 10 జీపీఏ
కామారెడ్డి పట్టణం- న్యూస్టుడే
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. 2020లో కొవిడ్ కారణంగా రెండేళ్లు ప్రత్యక్ష తరగతుల నిర్వహణ సక్రమంగా సాగలేదు. దీంతో రెండు విద్యాసంవత్సరాల్లో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వంద శాతం విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేశారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపింది. గతేడాది నుంచి ఫలితాల్లో ఉత్తీర్ణతశాతంలో స్వల్ప తేడాతో ర్యాంకు పడిపోయింది. ఈ సారి 132 మందికి 10 జీపీఏ ఫలితాలు వచ్చాయి. అందులో ప్రైవేటు 85, ప్రభుత్వ 47 మంది ఉన్నారు.
బాలికలదే పైచేయి
ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ సారి బాలురు 5879కి 5351(91.02 శాతం), బాలికలు 6047కి 5706 (94.36 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది బాలురు 92.39, బాలికలు 94.26 శాతం మెరుగైన ఫలితాలు సాధించారు.
869 మంది అనుత్తీర్ణత
జిల్లాలో ఆయా మండలాల పరిధిలో గతేడాది 792 అనుత్తీర్ణత చెందగా ఈ సారి 869 మంది ఉన్నారు. బాన్సువాడ మండలంలో 141, భిక్కనూరులో 30, బీబీపేటలో 20, బిచ్కుందలో 70, బీర్కూర్లో 9, దోమకొండలో 7, గాంధారిలో 85, జుక్కల్లో 10, కామారెడ్డిలో 112, లింగంపేటలో 30, మాచారెడ్డిలో 25, మద్నూర్లో 93, నాగిరెడ్డిపేటలో 43, నస్రుల్లాబాద్లో 34, నిజాంసాగర్లో 7, పెద్దకొడప్గల్లో 1, పిట్లంలో 28, రాజంపేటలో 11, రామారెడ్డిలో 26, సదాశివనగర్లో 10, తాడ్వాయిలో 22 ఎల్లారెడ్డిలో 55 మంది వివిధ సబ్జెక్టుల్లో అనుత్తీర్ణులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్రాష్ట్ర దొంగల పట్టివేత
[ 22-05-2024]
అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి పోలీసులు పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాకేంద్రం పట్టణ ఠాణాలో ఎస్పీ సింధూశర్మ మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. -
కలలు సాకారమయ్యేలా.. శిక్షణ
[ 22-05-2024]
గతంలో అవకాశాలు అంతగా వచ్చేవి కావు. ప్రస్తుతం నగరం, పట్టణ, గ్రామీణ స్థాయి క్రీడాకారులు సైతం తమ కలలు నెరవేర్చుకోవచ్చని హామీ ఇస్తున్నారు. -
అపసవ్యంగా వెళ్తే ప్రమాదమే..
[ 22-05-2024]
అపసవ్య దిశ(రాంగ్ రూట్)లో ప్రయాణించే వాహనదారులతో వారిaకే కాక ఎదుటి వారికీ ప్రమాదం వాటిల్లుతోంది. ఉద్దేశపూర్వకంగా రాంగ్ రూట్లో ప్రయాణించే వారి విషయంలో పోలీసులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించనున్నారు. -
అమ్మాయిలపైనే ప్రేమ
[ 22-05-2024]
కన్న బిడ్డలను పెంచలేక పోవడం.. పేదరికం.. ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో పుట్టిన వెంటనే ఆడ బిడ్డలను కొందరు వద్దనుకుంటే.. మరి కొందరు తమకు కావాలని అక్కున చేర్చుకుంటున్నారు. -
అవరోధాలు అధిగమిస్తేనే.. ఆదర్శం
[ 22-05-2024]
మేము విద్యారంగానికి ప్రాధాన్యమిస్తాం. బడుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశాం. -
ప్రిన్సిపల్ సంతకం లేకున్నా అనుమతి
[ 22-05-2024]
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని డీఐఈవో రవికుమార్ ఆదేశించారు -
తెవివి ఇన్ఛార్జి వీసీగా సందీప్ సుల్తానియా
[ 22-05-2024]
రాష్ట్రంలో పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ముగియటంతో ప్రభుత్వం ఐఏఎస్లను ఇన్ఛార్జిలుగా నియమించింది. -
వైద్యశాఖ సూపరింటెండెంట్ సస్పెన్షన్
[ 22-05-2024]
వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్నాయక్పై వేటు పడింది. ఉన్నతాధికారుల విచారణ నివేదిక ఆధారంగా అతడిపై చర్యలు చేపట్టారు. -
కల్లాలపైనే కళ్లు
[ 22-05-2024]
ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కల్లాల్లో పగలంతా ధాన్యాన్ని ఆరబోసుకుని రాత్రి వేళ కుప్పలుగా పేరుస్తున్నారు