న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన
తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది.
పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా గేట్కు తాళం
బీర్కూర్, న్యూస్టుడే : తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీర్కూర్కు చెందిన కుతాడి విజయ్కుమార్ అనే గుత్తేదారు 2021లో రూ.30 లక్షలతో పంచాయతీ కార్యాలయం ఎదుట వ్యాపార సముదాయ భవనాన్ని నిర్మించారు. 2022 మార్చిలో నిర్మాణం పూర్తి చేయడంతో అధికారులు రూ.20 లక్షల బిల్లును మంజూరు చేశారు. మిగితా రూ.10 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం పంచాయతీ కార్యాలయానికి డీపీవో శ్రీనివాస్రావు, డీఎల్పీవో నాగరాజు తనిఖీకి వచ్చారు. విషయం తెలుసుకున్న గుత్తేదారు తొలుత పంచాయతీ గేట్ ముందువైపు తాళం వేసి నిరసన తెలిపారు. తర్వాత గేటు లోపలికి తాళం వేసి అధికారుల వద్దకు వెళ్లి తన సమస్యను విన్నవించారు. అప్పటి బీర్కూర్ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి లంచం అడిగితే ఇవ్వలేదనే ఉద్దేశంతోనే గత రెండేళ్ల నుంచి తనకు రావాల్సిన బిల్లులు రాకుండా నిలిపివేశారని విజయ్కుమార్ ఆరోపించారు. బిల్లు ఇవ్వకుంటే పంచాయతీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని డీపీవో ఎదుట సదరు గుత్తేదారు కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్కి విషయం తెలిపి బిల్లు మంజూరు చేయిస్తానని డీపీవో శ్రీనివాస్రావు హామీ ఇవ్వడంతో గుత్తేదారు గేట్కు తాళం తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు