విమర్శల జోరు... కేరింతల హోరు
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు.
విశాల్ జనసభలో జోష్ నింపిన మోదీ ప్రసంగం
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, జోగిపేట, జోగిపేట టౌన్, అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. భారాస రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్, భారాస తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తీరును వివరించారు. సభకు రెండు నియోజకవర్గాల నుంచి భారీగా హాజరైన జనం ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపు ‘మోదీ మోదీ’ అంటూ కేరింతలతో హోరెత్తించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, భారాసలు కేంద్ర ప్రభుత్వంతో పాటు భాజపాపై చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టారు.
కమలదళంలో ఉత్సాహం
సభ విజయవంతం కావడంతో కమలదళంలో ఉత్సాహం నెలకొంది. కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్లతో పాటు మెదక్ నియోజవకర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ప్రధాని ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, గంగారాం, అరుణతార, నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, గోదావరి, సంగప్ప, గడ్డం శ్రీనివాస్, మోహన్, జైపాల్రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, విఠల్, వినయ్కుమార్, పైలా కృష్ణారెడ్డి , తానాజీరావు, నీలం చిన్నరాజులు, ప్రభాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ అభివృద్ధిలో అగ్రగామి
- బీబీపాటిల్, జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి
గత పదేళ్లకాలంలో జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని బీబీపాటిల్ అన్నారు. ప్రస్తుతం కొన్ని ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఇవి పూర్తికావాలంటే తనను గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. భాజపాకు చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు సాధించడం తేలికవుతుందన్నారు.
రేవంత్తో హరీశ్ కుమ్మక్కు
- రఘనందన్రావు, మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భారాస నేత హరీశ్రావు కుమ్మక్కయ్యారని రఘునందన్రావు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్కు అల్లుడి భయం పట్టుకుందని, కేసీఆర్కు జలక్ ఇచ్చేందుకే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు హరీశ్ పంపించారన్నారు. మార్చి 19న ఎమ్మెల్సీ కవితను పరామర్శించేందుకు దిల్లీ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో రేవంత్రెడ్డి, హరీష్రావు ఒకే విమానంలో ప్రయాణించారన్నారు. ఈ సమయంలో దాదాపు రెండు గంటల పాటు మంతనాలు సాగించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవకతవకల్లో మొదటి ముద్దాయి హరీశ్రావేనన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయన పేరును చేర్చడం లేదన్నారు. జహీరాబాద్, మెదక్ స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు.
నిజానికి, అబద్ధానికి జరుగుతున్న ఎన్నికలు
- వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, కామారెడ్డి
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు నిజానికి, అబద్ధానికి జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస అబద్ధాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హోంమంత్రి అమిత్షా సిద్దిపేటలో మాట్లాడిన మాటలను వక్రీకరించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ తప్పుడు ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించడం దారుణమన్నారు. భాజపా కార్యకర్తలకు ఏదైనా సాధించే సత్తా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు