పరిధి దాటింది.. బిల్లు వచ్చింది
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు.
వినియోగం పెరగడంతో తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య
కామారెడ్డి సంక్షేమం, న్యూస్టుడే
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. గృహాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరాయంగా నడుస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు 200 యూనిట్ల పరిధి దాటుతున్నారు. దీంతో వారు బిల్లుల చెల్లింపు పరిధిలోకి వస్తున్నారు. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్కు వచ్చేసరికి 4,516 మంది వినియోగదారులు పరిధి దాటడంతో బిల్లులు వచ్చాయి. ఒకవేళ వీరు మళ్లీ 200 యూనిట్లలోపు వాడుకుంటే మళ్లీ శూన్య బిల్లులు వస్తాయి.
గృహావసరాలకే డిమాండ్..
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ సీజన్ తగ్గింది. వరికోతలు పూర్తికావడంతో రైతులు బోరుబావులకు విశ్రాంతి ఇచ్చారు. కాని గృహావసరాలకే విద్యుత్తు డిమాండ్ అధికంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాకు నిత్యం 4.65 మిలియన్ యూనిట్లు కోటా కేటాయించారు. ఇందులో సరాసరిగా 2.22 మిలియన్ యూనిట్లను వినియోగిస్తున్నారు. అందులో వాణిజ్య, పరిశ్రమల అవసరాలు పోను మిగతా విద్యుత్తును గృహావసరాలకే వినియోగిస్తున్నారు. మేలో గృహావసరాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గృహజ్యోతి వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ..
ఉక్కపోతలు, ఎండలతీవ్రత కారణంగా వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తుండడంతో చాలా మంది వినియోగదారులు ఫ్యాన్లు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఏసీలు కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఒక్క నిమిషం విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగినా ఫ్యాన్లు, కూలర్లు నడవక వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో విద్యుత్తు వినియోగం ఒక్క సారిగా పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామాల్లో మురుగు నీటి సమస్య పరిష్కరించాలి
[ 21-05-2024]
మండలంలోని అనేక గ్రామాలలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలో వినియోగించిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. -
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
[ 21-05-2024]
మద్యానికి బానిసై ఉరి పెట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. -
నాగిరెడ్డిపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి
[ 21-05-2024]
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. -
ఐకేపీ కార్యాలయాన్ని సందర్శించిన డీఆర్డీవో
[ 21-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల ఐకేపీ కార్యాలయాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ నాయక్ సందర్శించారు. -
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
-
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
-
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
-
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ