ఆగని గంజాయి రవాణా
జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
అధికారులను ఏమారుస్తూ విచ్చలవిడిగా దందా
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే : జిల్లాల్లో ఒక్కో తీరున గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు కనిపించడం లేదు. ఇటీవల చాక్లెట్ల రూపంలో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక రైళ్లు, ఇతర వాహనాల్లో గంజాయి రవాణా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక రైళ్లలో ఎండుగంజాయిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. కార్లు, టాటాసుమోలు, ఇతర వాహనాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి జిల్లాకు గంజాయి చేరుకుంటోంది.
ఎన్నికల వేళ మినహా మిగతా సమయాల్లో వాహనాల తనిఖీ నామమాత్రంగా ఉండడంతో అంతర్ రాష్ట్రాల సరిహద్దు చెక్పోస్టులను సైతం సులువుగా దాటి గంజాయిని తీసుకొస్తున్నారు. కామారెడ్డి జిల్లా సరిహద్దు మండలంలోని ఓ గ్రామంలో గంజాయి అక్రమ దందా కోసం కొందరు ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నా అధికారులు తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరు వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాకు మాత్రమే వినియోగిస్తున్నారన్న విమర్శలున్నాయి. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఆబ్కారీ, పోలీసు, రెవెన్యూ, రవాణా, వ్యవసాయ, రైల్వే శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.
‘కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులో రాత్రి పూట కొందరు యువకులు ద్రవ రూపంలో ఉన్న గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి మూలాలను తొలగించేందుకు పోలీసులు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చింతపల్లికి వెళ్లి ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించారు.’
కామారెడ్డి జిల్లాకేంద్రంలో ముగ్గురు యువకులు ఎండు గంజాయిని పొట్లాల్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి వినియోగదారులకు సంబంధించిన చరవాణి నంబర్లను ఆరా తీస్తే వారిలో మెజారిటీ విద్యార్థులుండడంతో అవాక్కయ్యారు. గంజాయి వినియోగిస్తున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాజాగా ఈ నెల 26న కామారెడ్డి జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్న టీ స్టాల్లో ఏడు ఎండు గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. వీటిని నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన మహిళ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సరఫరా అవుతున్నట్లు కామారెడ్డి ఆబ్కారీ శాఖ అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
సమన్వయంతోనే కట్టడి సాధ్యం
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడి సాధ్యమవుతుంది. ఇప్పటికే గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేశాం. దీనికోసం పోలీసులు, రవాణా, రైల్వే, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో సమన్వయం అవసరమవుతోంది. అందరూ సహకరిస్తేనే కట్టడి చేయవచ్చు.
రవీందర్రాజ్, కామారెడ్డి జిల్లా ఆబ్కారీశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృత్తి విద్యా కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
[ 15-05-2024]
సెట్విన్ కింద వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ టీటీఐ తెలంగాణ ప్రభుత్వ కో-ఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
డీఎంహెచ్వోపై విచారణ
[ 15-05-2024]
ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులపై అనుచితంగా వ్యవహరించిన లక్ష్మణ్ సింగ్పై వైద్య శాఖ ఏడీ అమర్ సింగ్ బుధవారం విచారణ చేపట్టారు. -
విద్యార్థులు... విజ్ఞాన దీపికలు
[ 15-05-2024]
గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారు. ఇందూరు సాహిత్యం, చారిత్రక, పర్యాటక, ప్రజా సంక్షేమం విషయాల సేకరణ, క్షేత్ర పర్యటనలు వంటి అంశాల్లో రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించండి
[ 15-05-2024]
జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు ఒకటి. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్, వేల్పూర్ మండలాల్లోని గ్రామాలకు రెండు పంటల నీరందిస్తున్నారు. -
ఈ గ్రామాలు ఆదర్శం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు -
ఆలోచన అదిరే!
[ 15-05-2024]
ఎండలు మండుతున్న తరుణంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన యువకుడు బోగేష్. ఈయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. -
పైకి గాంభీర్యం.. లోలోన లెక్కలు
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. గెలుపుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకొంటున్నారు. -
ప్రవేశాల పెంపునకు కసరత్తు
[ 15-05-2024]
గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
నేడు విచారణ
[ 15-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్సింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఆలస్యంగా కొనుగోళ్లు
[ 15-05-2024]
తల్లి బిడ్డలను కంటికి రెప్పలాగా ఎలా దాచుకుంటుందో.. అన్నదాతలు సైతం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకొని నానా అవస్థలు పడి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీలు రాక వర్షానికి తడిసి ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే కరవయ్యారు. -
పెరిగిన ఓటింగ్తో ఉత్కంఠ
[ 15-05-2024]
హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.63 నమోదైంది. సుమారు ఐదుశాతం మేర పోలింగ్ పెరిగింది -
ఆమె కదిలింది
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోలింగ్ మాదిరిగానే ఓటర్లు పోటెత్తారు. నవంబరులో శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో 12,39,568 ఓట్లు పోలయ్యాయి -
‘1.30 లక్షల మెజారిటీతో గెలుస్తాం’
[ 15-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
[ 15-05-2024]
విద్యుత్తు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ