logo

దేశాభివృద్ధి చెందాలంటే భాజపాకి పట్టం కట్టాలి

మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

Published : 02 May 2024 14:13 IST

నాగిరెడ్డిపేట: మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం గ్రామంలో  గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా భాజపా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. భారతదేశం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని, మరింత అభివృద్ధి చెందాలంటే భాజపాకు పట్టం కట్టాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజా గౌడ్,  కార్యదర్శి మల్లేష్,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని