logo

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజాస్వామ్యంలో ఓటు  వజ్రాయుధమని, దాన్ని  ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని  ఐఎస్ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ అన్నారు.

Published : 08 May 2024 13:36 IST

రామారెడ్డి: ప్రజాస్వామ్యంలో ఓటు  వజ్రాయుధమని, దాన్ని  ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని  ఐఎస్ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ అన్నారు.  ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) స్వచ్ఛంద సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రామారెడ్డి మండలం పోసానిపేట్  గ్రామ ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఎలాంటి  ప్రలోభలకు గురికాకుండా వినియోగించుకోవాలని సూచించారు.  అనంతరం ఓటర్లందరితో  ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో ఐ.ఎస్.ఆర్.డి సిబ్బంది శివాజీ రావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని