logo

ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

నాగిరెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు స్థానిక ఎస్సై రాజు చేతులమీదుగా కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Updated : 08 May 2024 17:06 IST

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు స్థానిక ఎస్సై రాజు చేతులమీదుగా కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ దేశబోయిన సాయిలు మాట్లాడుతూ.. ఎందరో రక్తహీనత రోగుల ప్రాణాలు కాపాడిన రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల సభ్యులు కొంపల్లి యాదగిరి గౌడ్, అశ్వక్ అలీ తోపాటు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని