logo

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని వివిధ పక్షాల ప్రతినిధులు వెల్లడించారు.

Published : 08 May 2024 21:29 IST

కామారెడ్డి పట్టణం: ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని వివిధ పక్షాల ప్రతినిధులు వెల్లడించారు. కామారెడ్డిలో బుధవారం సిటిజన్స్ అసోసియేషన్, మహిళావేదిక, జలసాధనసమితి, అధ్యయనవేదిక సంయుక్తంగా ఓటరు చైతన్య ప్రతులను బుధవారం ఆవిష్కరించారు. దేశంలో అనేక రంగాలు సంక్షోభంలో ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, సీపీఐ సీనియర్ నాయకుడు వీఎల్ నర్సింహ్మారెడ్డి, ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు వేణుగోపాల్, టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు రమణ, ప్రతినిధులు శ్రీనివాస్, అంజయ్య, సంజీవరావు, శ్రీధర్, నరేందర్, నాగభూషణం తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని