స్కాన్ చెయ్.. చదివెయ్
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
క్యూఆర్ కోడ్తో అందుబాటులో కథలు, నవలలు
లిటరసీ క్లౌడ్ క్యూఆర్ కోడ్
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చదవడం, రాయడం అలవాటు చేయడం ద్వారా మౌఖిక భాష వికాస అభివృద్ధికి దోహదం చేయనుంది. అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఇంటివద్దనే లిటరసీ క్లౌడ్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు ఆకర్షణీయమైన, అభిరుచిని కలిగించే తెలుగు పుస్తకాలను రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అందులో పొందుపరిచారు. ఇవి విద్యార్థుల్లో చదవడం అలవాటు పెంచేందుకు ఉపకరిస్తుంది.
ఇంటి వద్దే చదివించేలా..
ఎండలు మండుతున్నాయి. పిల్లలంతా ఇంటి వద్ద చరవాణులు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యంత్రాంగం వినూత్న పంథా అనుసరిస్తోంది. పిల్లలు ఇంటివద్దే సెలవులను ఆహ్లాదంగా గడపడానికి అధికారులు నిర్దేశించిన లిటరసీ క్లౌడ్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ కథల పుస్తకాలు, నవలలు, సందేశాత్మక చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. పుస్తకాలను చదవడం ద్వారా పఠనాసక్తి పెరుగుతుంది.
http:///literacycloud.org/stories?language=telugu&short=new%20arrivals లింక్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
జ్ఞానం పెంపొందించడానికే..
వేణుశర్మ, విద్యాశాఖ సమన్వయకర్త- కామారెడ్డి జిల్లా
పిల్లల్లో జ్ఞానం పెంపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. లిటరసీ క్లౌడ్ ద్వారా విద్యార్థులకు ఆయా అంశాల్లో అవగాహన కల్పించనున్నాం. ఇచ్చిన లింక్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా కథల పుస్తకాలు, నవలలు, వివిధ చిత్రాల సమాచారం తెలుసుకోవచ్చు. ఇవి వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.