ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
ఆర్మూర్ పట్టణం, న్యూస్టుడే: ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్వి 420 హామీలని ఆరోపించారు. పసుపు బోర్డు, గల్ప్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏమైందని భాజపా అభ్యర్థి అర్వింద్ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత కృషితోనే ఆడబిడ్డలకు బీడీ పింఛన్లు వచ్చాయని గుర్తు చేశారు. 1994లో ఆర్మూర్ ప్రజలు స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిపించారని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు, రైతు రుణమాఫీ లేదు, తులం బంగారం లేదని ఎద్దేవా చేశారు. కోరుట్ల, జగిత్యాల్, బాల్కొండలో భారాస ఎమ్మెల్యేలు ఉన్నారని, సర్వేల ప్రకారం మనం గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అర్వింద్ విద్వేషాలు రెచ్చగొట్టడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. భాజపా, కాంగ్రెస్ నాయకుల మాటలు తప్ప, ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు నకిలీ అని ఆరోపించారు. ఆయన వెంట భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, నాయకులు పూజ నరేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
[ 20-05-2024]
బీర్కూర్లో సోమవారం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓపెన్ జిమ్ పార్కును పరిశీలించిన బల్దియా ఛైర్ పర్సన్
[ 20-05-2024]
పట్టణంలోని గోదాం రోడ్ మున్సిపల్ ఓపెన్ జిమ్ పార్క్ ను బల్దియా ఛైర్ పర్సన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. -
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ