అమలుకాని చలువ పైకప్పు విధానం
ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇ
నగర, పురపాలికల్లో వేడెక్కుతున్న భవనాలు
కామారెడ్డి పట్టణం-న్యూస్టుడే
ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే జిల్లాలో 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండాలి. కాని 38 డిగ్రీలకు చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చలువ పైకప్పు విధానాన్ని గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఇళ్లలో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు స్లాబ్పై తెల్లని పెయింట్ వేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఎక్కడా సక్రమంగా అమలుకావడం లేదు.
నివాసయోగ్య భవనాలకు తప్పనిసరి
ప్రతి పురపాలికకు 6 లక్షల చదరపు అడుగుల మేర పెయింట్ వేసేలా లక్ష్యం నిర్దేశించారు. 600 చదరపు గజాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన నివాసయోగ్య భవనాలకు చలువ విధానం తప్పనిసరి చేసింది. అపార్ట్మెంట్ నిర్మాణాలు, భారీ భవంతులు దీని పరిధిలోకి వస్తాయి. కోరిన వారందరికీ నిర్ణీత రుసుం స్వీకరించి ప్రక్రియను అమలు చేయాలి. సర్కారు భవనాలు, వాణిజ్య సముదాయాలకు తప్పనిసరి చలువు విధానం వర్తింపజేయాలి.
చల్లగా మార్చే ప్రక్రియ
భారీ భవనాలను సిమెంట్ కాంక్రీట్తో నిర్మించడంతో పై కప్పులు ఎండకు వేడెక్కుతాయి. చలువ పై కప్పు విధానంలో సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా పైకప్పునకు ప్రత్యేక పూత పూస్తారు. ఇందులో మూడు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో లైమ్వాష్/పాలిమర్/ప్లాస్టిక్ సాంకేతికతను వినియోగిస్తారు. రెండో పద్ధతిలో పాలివినీల్ క్లోరైడ్ ఆధారంగా పైకప్పును తీర్చిదిద్దుతారు. మూడో పద్ధతిలో ఆల్బిడో, సిరామిక్ మొజాయిక్ టైల్స్ను పైకప్పులో అమరుస్తారు. మూడింటిలో ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు. పై కప్పులో వినియోగించే సామగ్రి వేడిని తగ్గిస్తాయి. సాధారణ ఇళ్లతో పోలిస్తే చలువ పై కప్పు ఉన్న నిర్మాణాలు 80 శాతం వేడి ప్రభావం లేకుండా చేస్తాయి. సర్కారు ఆమోదించిన ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు ఈ పనులను నిర్వహిస్తాయి. చలువ పై కప్పు విధానంపై ప్రజల్లో అవగాహన రావాల్సి ఉందని కామారెడ్డి పట్టణ ప్రణాళిక విభాగాధికారి గిరిధర్ న్యూస్టుడేతో అన్నారు. ఈ విషయమై మరింత చైతన్యం కలిగించేందుకు చర్యలు చేపడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దినాలకొచ్చి.. మృత్యు ఒడిలోకి
[ 20-05-2024]
దినాలకొచ్చి చెట్టుకు ఉరి పెట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని కాటేపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. -
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
[ 20-05-2024]
బీర్కూర్లో సోమవారం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓపెన్ జిమ్ పార్కును పరిశీలించిన బల్దియా ఛైర్ పర్సన్
[ 20-05-2024]
పట్టణంలోని గోదాం రోడ్ మున్సిపల్ ఓపెన్ జిమ్ పార్క్ ను బల్దియా ఛైర్ పర్సన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. -
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ