logo

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరి లింబాద్రి అన్నారు. 

Updated : 10 May 2024 12:45 IST

రామారెడ్డి: కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరి లింబాద్రి అన్నారు.  ఇసన్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పిప్పరి లింగం, మాజీ ఉపసర్పంచ్ రాజేందర్, శెట్టిపల్లి భైరయ్య, దోమకొండ భైరయ్య, ధరణి మల్లయ్య, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు