మాది చేతల ప్రభుత్వం
తమది చేతల ప్రభుత్వమని, చెప్పింది చేస్తామని, భాజపా నేతల మాదిరి మాటలు చెప్పి మభ్యపెట్టబోమని ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన పట్నాయక్ చెప్పారు.
భాజపా మాదిరి మాటలతో మభ్యపెట్టం
పద్మపూర్ ఎన్నికల ప్రచారంలో సీఎం నవీన్
ఝార్బంధ్ సభలో మహిళా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తున్న నవీన్
భువనేశ్వర్, బరగఢ్, న్యూస్టుడే: తమది చేతల ప్రభుత్వమని, చెప్పింది చేస్తామని, భాజపా నేతల మాదిరి మాటలు చెప్పి మభ్యపెట్టబోమని ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన పట్నాయక్ చెప్పారు. శుక్రవారం పద్మపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఝార్బంధ్, పైకమాల్, పద్మపూర్ సమితుల్లో ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. అధికారమే పరమావధిగా చేసుకున్న కేంద్ర మంత్రులు రాష్ట్రానికొచ్చి అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అన్నదాతల గురించి చెప్పుకుంటున్న వారు వరికి మద్దతు ధర పెంచాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని, ఈ విషయమై తాము ఎన్నిసార్లు కోరిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర రైతుల కోసం పీఎం ఫసల్ బీమా వాయిదాల కింద రూ.630 కోట్లు చెల్లించినా, సకాలంలో బీమా చెల్లించని కేంద్రం నేతలు ఇక్కడ అవాస్తవాలు చెబుతున్నారన్నారు. బరగఢ్, నువాపడా రైలు మార్గానికి స్థలం కేటాయించలేదని ఎన్నికల సభల్లో చెబుతున్నారని, నిర్మాణాలకు ఇంత వరకు సర్వే జరగలేదన్నారు. ఎంత స్థలం అవసరమవుతుందన్న వివరాలు ప్రభుత్వానికి తెలియజేయని దిల్లీ పెద్దలు ఇవాళ స్థలమిస్తే రేపు పనులు ప్రారంభిస్తామని ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. బంగారంపై 3 శాతం వస్తుసేవల పన్ను వసూలు చేస్తుండగా, నిరుపేద కార్మికులు చేస్తున్న బీడీ ఆకుల సేకరణపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు.
జనం కోసం పనులు చేస్తున్నాం
పైకమాల్, పద్మపూర్ సభల్లో మాట్లాడిన సీఎం నాలుగున్నర కోట్ల రాష్ట్ర ప్రజలను తాము దేవుళ్లుగా ఆరాధిస్తున్నామన్నారు. పాలకులు సేవకులన్న వాస్తవాన్ని జీర్ణించుకున్న తాము నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. పనుల చేసేవారిని గెలిపించాలని, బిజద అభ్యర్థి బార్షారాణి సింగ్ బరిహను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. పైకమాల్, ఝార్బంధ్, పద్మపూర్ సభా వేదికలపై ఆయా సమితులకు చెందిన వివిధ కులాల పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
పైకమాల్ సభా వేదికపై నవీన్కు పాదాభివందనం చేస్తున్న బర్షారాణి సింగ్ బరిహ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వాయర్లో మునిగి ముగ్గురు మృతి
[ 04-05-2024]
ఉక్కు నగరం రక్షణ రిజర్వాయర్లో శనివారం సాయంత్రం విషాధ ఛాయలు అలుముకున్నాయి. కేతా నది రిజర్వాయర్లో ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. -
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM