Odisha: నదిలో రబ్బరు ట్యూబుపై రోగి తరలింపు
కొంధమాల్ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో మహాసింఘ్ పంచాయతీలోని కుబేరముండా గ్రామానికి చెందిన అనంతి ప్రధాన్ (45) అనే రోగిని భర్త రఘునాథ ప్రధాన్, ఇతర కుటుంబ సభ్యులు రబ్బరు ట్యూబుపై ఖడ్గ నదిని దాటించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్్ అయింది.
రబ్బరు ట్యూబుపై రోగిని తరలిస్తున్న గ్రామస్థులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: కొంధమాల్ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో మహాసింఘ్ పంచాయతీలోని కుబేరముండా గ్రామానికి చెందిన అనంతి ప్రధాన్ (45) అనే రోగిని భర్త రఘునాథ ప్రధాన్, ఇతర కుటుంబ సభ్యులు రబ్బరు ట్యూబుపై ఖడ్గ నదిని దాటించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్్ అయింది. అనంతి నాలుగు రోజులుగా అతిసారంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మహాసింగ్కు ఆమెను తరలించాలంటే గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న ఖడ్గ నది దాటాల్సిందే. నదిపై వంతెన లేకపోవడంతో ఆమెను రబ్బరు ట్యూబుపై ఉంచి భర్త, ఇతరులు ఇటీవల నదిని దాటారు. అనంతరం మహాసింఘ్ నుంచి ఆమెను అంబులెన్స్లో బలిగుడలోని ఆసుపత్రికి తరలించారు. కుబేరముండా గ్రామంలో పదిహేను కుటుంబాలు ఉన్నాయి. వారంతా ఖడ్గ నది నీటిలో రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నది మీదుగా మహాసింఘ్కు రెండు కి.మీ. దూరం ఉండగా, కె.నువాగాంకు వెళ్లేందుకు చుట్టూ తిరిగి 22 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వారు ప్రమాదమని తెలిసినా నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఖడ్గ నదిపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
రోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్