logo

కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌కు వినతి

జియఫరం పట్టణంలో ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సంబంధించి దిల్లీ కేవీ కమిషనర్ సర్దార్ సింగ్ చౌహాన్‌కు వినతి ప్రతం అందించారు.

Published : 07 May 2024 18:03 IST

నవరంగ్‌పూర్‌: జియఫరం పట్టణంలో ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సంబంధించి దిల్లీ కేవీ కమిషనర్ సర్దార్ సింగ్ చౌహాన్‌కు వినతి ప్రతం అందించారు. స్థానిక యువ సామాజిక కార్యకర్త అకిరణ్ మర్రి మంగళవారం వినతి పత్రం అందజేశారు. కిరణ్‌ సామజిక మాధ్యమం ఫేస్ బుక్ పేర్కొన్న వివరాలు ప్రకారం.. స్థానిక సేవల్ ఆసుపత్రి సమీపంలో 8 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో వివిధ చర్చల అనంతరం శంకుస్థాపన జరిగిందని చెప్పారు. రోజులు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదని వినతి పత్రం అందించినట్లు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని