గెలిచి వదిలేస్తారా?.. సమస్యలు పరిష్కరిస్తారా?
కంటాబంజి... బొలంగీర్ జిల్లాలోని ఈ ప్రాంతం వలసలకు చిరునామా. తరాల మారినా తమ తలరాతలు మారలేదని ఉసూరుమనే ప్రజలు రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తూ కుటుంబాలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నారు.
విపక్ష నేతల విమర్శలు
నిన్న బిజేపూర్, నేడు కంటాబంజిలో నవీన్ పోటీ
భువనేశ్వర్, న్యూస్టుడే: కంటాబంజి... బొలంగీర్ జిల్లాలోని ఈ ప్రాంతం వలసలకు చిరునామా. తరాల మారినా తమ తలరాతలు మారలేదని ఉసూరుమనే ప్రజలు రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తూ కుటుంబాలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నారు. కంటాబంజి అసెంబ్లీ నియోజకవర్గం దుస్థితిపై శాసనసభలో పలుసార్లు చర్చ జరిగినా పాలకులు స్పందించలేదు. పశ్చిమ ఒడిశాలోని ఈ వెనుకబడిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోటీ చేస్తున్నారు.
నెరవేరని జిల్లా ఏర్పాటు హామీ..
1997లో గంజాం జిల్లా అస్కా లోక్సభ స్థానం నుంచి తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన నవీన్ 2000లో ఈ నియోజకవర్గంలోని హింజిలి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004, 2009, 2014, 2019లో అక్కడి నుంచే వరుస విజయాలు సాధించారు. ఈసారి మళ్లీ ఇక్కడి నుంచి నామపత్రాలు దాఖలు చేశారు. గతసారి సీఎం హింజిలితోపాటు పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ జిల్లా బిజెపూర్ నుంచి పోటీ చేశారు. రెండుచోట్లా గెలిచిన ఆయన బిజెపూర్ వదులుకున్నారు. గతసారి నవీన్ బిజెపూర్ నుంచి పోటీ చేయడానికి కారణం భాజపా దూకుడుకు కళ్లెం వేయడానికేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. అప్పట్లో ప్రచారానికి వచ్చిన ఆయన బిజెపూర్ వాసులకు ఎన్నో హామీలిచ్చారు. బరగఢ్ జిల్లాలోని పదంపూర్ సబ్డివిజన్ను జిల్లా చేస్తానన్నారు. బిజెపూర్ సీటు వదులుకున్న సీఎం ఆ తర్వాత ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, అన్ని రంగాల్లో అగ్రగామి చేస్తానన్నారు. పదంపూర్ జిల్లా కల ‘అందని మానిపండు’ చందం కాగా ప్రజలు ఇబ్బందులు అలాగే కొనసాగుతున్నాయి.
బొలంగీర్ రైల్వే స్టేషన్ నుంచి వలస వెళుతున్న కార్మికులు
పత్తికేదీ గిట్టుబాటు?
ఈసారి నవీన్ హింజిలితోపాటు కంటాబంజి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వనరులు పుష్కలంగా ఉన్నా, సద్వినియోగానికి నోచుకోని కంటాబంజి వలసలకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలోని తురైరెలా సమితిలో అత్యధికంగా 40 వేల మంది రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్నారు. విస్తారంగా పత్తి ఉత్పత్తి అయ్యే ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేదు. వ్యాపారులు, దళారులు చెప్పిందే ధర. దీనిపై పాలకుల నిఘాలేదు. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి అభివృద్ధిలోకి తేవాలన్న రెండు దశాబ్దాల ప్రజల డిమాండు నెరవేరలేదు. విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయి. దీనిపై బొలంగీర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత నర్సింగ మిశ్ర పలుసార్లు శాసనసభలో ప్రస్తావించారు. వెనుకబాటు, వలసలకు చిరునామా అయిన కంటాబంజిని సీఎం ఈసారి ఎంపిక చేసుకుని పోటీ చేయడానికి కారణం ఓటు బ్యాంకు కోసమేనన్నది స్పష్టం. తాను బరిలో దిగితే పశ్చిమ జిల్లాలపై ప్రభావం పడుతుందని, భాజపాను నిలవరించడానికి, ప్రజా వ్యతిరేకతను తుడిచి పెట్టేయడానికి ఇది ఎత్తుగడ కావచ్చని పరిశీలకులంటున్నారు.
సూరత్ మినీ గంజాం
24 ఏళ్లుగా గంజాం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్ ఉపాధి కల్పనలో విఫలమయ్యారన్నది నిష్ఠుర సత్యం. అయిదు లక్షల మంది (కార్మికశాఖ వివరాల ప్రకారం) ఈ జిల్లా వాసులు రాష్ట్రేతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. సూరత్ (గుజరాత్)లో అత్యధికంగా 3 లక్షల మంది ఉంటున్నారు. అందుకే సూరత్ను అంతా ‘మినీ గంజాం’గా పేర్కొంటారు. నేత, వజ్రాల కటింగ్ మిల్లుల్లో, ఇతర అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలి నియోజకవర్గంలో వలసలు ఎక్కువ. పండగలు, శుభకార్యాలకు చుట్టం చూపుగా వచ్చే వారంతా మళ్లీ వెళ్లిపోతుంటారు. అక్కడే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆయా పరిశ్రమల యాజమాన్యాల మోసాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలు వారి రాకపోకల ఖర్చులు భరించి తీసుకువస్తుంటాయి. రెండు పుష్కరాలుగా తనను ఆదరిస్తున్న గంజాం జిల్లాలో సూక్ష్మ, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించి ఉంటే ప్రజలు వలసపోయే పరిస్థితి ఉండేది కాదు. ఈ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టని నవీన్ గంజాం జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా సద్వినియోగం చేయలేకపోయారు. 35 శాతం పంటపొలాలకు నీటి పారుదల లక్ష్యం నెరవేరలేదు. ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు లేవు. మత్స్య సంపదకు మార్కెటింగ్ సౌకర్యం లేదు. పర్యాటక రంగం అభివృద్ధి సాధించలేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి దయనీయం. వైద్యులు లేని దవాఖానాలు ఆశించిన సేవలు అందించలేకపోతున్నాయి. డ్రాపౌట్లు యథాతథంగా ఉన్నాయి. ఇది స్థూలంగా గంజాం జిల్లా ముఖ చిత్రం.
వలసలపై ఇదీ బిజద సమాధానం
బిజు కార్మిక సమాఖ్య సమన్వయకర్త, కటక్ నగర మేయరు సుభాష్ సింగ్కు సీఎం కంటాబంజి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. రాజకీయ వ్యూహకర్తగా బిజదలో గుర్తింపు పొందిన ఆయన రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి సుభాష్ విలేకరులతో మాట్లాడుతూ... వలసలపై భిన్నంగా మాట్లాడారు. ఎక్కువ సంపాదించాలన్న ధ్యేయం గలవారు సూరత్, ముంబయి, బెంగుళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లి ఇటుకల బట్టీలు, ఇతర కర్మాగారాల్లో పనులు చేస్తున్నారన్నారు. వలస వెళ్లడాన్ని మరికొందరు గౌరవంగా భావిస్తున్నారన్నారు. పశ్చిమ ఒడిశా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కంటాబంజిని ఎంచుకున్న సీఎంను ప్రజాబంధుగా అభివర్ణించారు. కంటాబంజి వికాసానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేశారన్నారు.
బూటకం హామీలు
కంటాబంజి సిటింగ్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతసారి బిజెపూర్ వాసులకు మాయమాటలు చెప్పిన సీఎం ఈసారి కంటాబంజికి వచ్చారన్నారు. టెక్స్టైల్ మిల్లు ఏర్పాటు చేయాలని, వలసల నివారణకు శాశ్వత కార్యక్రమాలు ప్రారంభించాలని అసెంబ్లీలో చేసిన వినతులు పట్టించుకోని నవీన్ బూటకం హామీలివ్వడానికి కంటాబంజి వచ్చారని ప్రజలంతా భావిస్తున్నారన్నారు.
ఏం చెబుతారు?
కంటాబంజిలో జనాదరణ గల లక్ష్మణ్బాగ్ను భాజపా నిలబెట్టింది. ఉన్నత విద్యావంతుడైన ఆయన ఆదర్శభావాలు గల సామాజిక కార్యకర్త. మాతృభూమికి సేవలు చేయాలన్న సత్సంకల్పంతో పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆదరిస్తారని విలేకరులకు చెప్పారు. భాజపాకు పశ్చిమంలో సానుకూల పవనాలు వీస్తున్నందున ఓటమి భయం గల సీఎం తాను పోటీ చేస్తే పరిస్థితి కొంతమేర మారుతుందన్న ఎత్తుగడ వేశారని దీన్ని ఓటర్లు చిత్తు చేస్తారన్నారు. కంటాబంజికి ఏం చేశారని ప్రశ్నిస్తున్న వారికి నవీన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
పాండ్యన్ కోసమే ఈ సన్నాహం
భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్మహాపాత్ర్ బుధవారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... హింజిలి, కంటాబంజిలో పోటీ చేస్తున్న సీఎం తనకు అండగా ఉన్న వి.కార్తికేయ పాండ్యన్ కోసం ఒక సీటు రిజర్వు చేయడానికి ఎత్తుగడ వేశారన్నారు. రెండు చోట్ల గెలిస్తే ఒకదాన్ని వదులుకుని పాండ్యన్కు అసెంబ్లీకి ఎంట్రీ చేయించాలన్న దురాలోచనతో ఉన్నారని, ఇది నెరవేరదని, ప్రజలు ఈసారి గుణపాఠం చెబుతారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్.. డ్రైవర్ మృతి
[ 20-05-2024]
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమీపంలోని పుకిలి కూడలి వద్ద ఓ మినీ ట్రక్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. -
రెండో విడత పోలింగ్.. ప్రిసైడింగ్ అధికారిణికి అస్వస్థత
[ 20-05-2024]
ఒడిశాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుందర్గఢ్ జిల్లాలోని 211వ పోలింగ్కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిణి అస్వస్థతకు గురై కింద పడిపోయారు. -
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్