బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్
తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
గోపాల్పూర్లో బిజద నేతలు, పాత్రికేయులతో పాండ్యన్
భువనేశ్వర్, న్యూస్టుడే: తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గంజాం జిల్లాలో రెండు రోజులు ఎన్నికల ప్రచారం చేసిన పాండ్యన్ గోపాల్పూర్లో విడిది చేశారు. బిజదకు అనుకూలంగా ఉన్న కొన్ని ప్రసార మాధ్యమాల ముందు మాట్లాడారు.
కుటిల యత్నాలు...
రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం భాజపాకు లేదన్నారు. 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గతంలో చేసిన కుటిల యత్నాలు ఒడిశాలోనూ చేయాలన్న ధ్యేయంతో ఉందన్నారు. బిజదలో చీలికలు తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టే ఎత్తుగడలో ఉన్న భాజపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మెజారిటీ సీట్లు సాధించలేమన్న సంగతి భాజపా పెద్దలకు తెలుసునని, కుయుక్తులతో గద్దె ఎక్కాలన్న ‘మిషన్’ అమలుకు శ్రీకారం చుట్టారని పాండ్యన్ చెప్పారు.
ధర్మేంద్ర పదేళ్లలో ఏం చేశారు?
ముఖ్యమంత్రి నవీన్ను తరచు విమర్శిస్తున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాతృభూమికి గడిచిన పదేళ్ల కాలంలో ఏం చేశారని పాండ్యన్ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన 8 మంది భాజపా ఎంపీలు లోక్సభలో రాష్ట్రం ఇబ్బందులు, హక్కుల గురించి ఒక్కసారైనా ప్రస్తావించారా? అని అడిగారు. రాష్ట్ర గౌరవం, సంస్కృతి గురించి తరచూ మాట్లాడుతున్న భాజపా నేతలు శ్రీజగన్నాథ్, శామలాయి ఆలయాల కారిడార్ నిర్మాణాలపై విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధి పనులపైనా బురద జల్లుతున్నారని, ఇదంతా ప్రజలు చూస్తున్నారన్నారు.
ఆగ్రహించిన భాజపా
పాండ్యన్ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సమీర్ మహంతి బుధవారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి సీఎం వద్ద గుమస్తాగా ఉంటూ పాలనాయంత్రాంగాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి వేసిన ఎత్తుగడను చిత్తుచేస్తామన్నారు. ఓడిపోతామన్న భయంతో బిజద నేతలు అవాస్తవాలు చెబుతున్నారన్నారు.
భువనేశ్వర్ లోక్సభ అభ్యర్థి అపరాజిత షడంగి గురువారం విలేకరులతో మాట్లాడుతూ... నవీన్ సామర్థ్యం కొరవడిన సీఎంగా ముద్రపడ్డారని, వెనుకబాటు, వలసలు, ఖనిజసంపదల దుర్వినియోగం, అవినీతికి నిలువుటద్దమన్నారు. భాజపాకు అసెంబ్లీలో ఆధిక్యత లభిస్తుందని, గుమస్తాను తమిళనాడు పంపిస్తామని ఘాటుగా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ ఢీకొని ఇద్దరి మృతి
[ 20-05-2024]
గంజాం జిల్లా ఛమ్మాఖండి ఠాణా పరిధిలోని టాటా ప్లాంట్ సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం బైకును ఒక లారీ ఢీకొంది. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
[ 20-05-2024]
ఢంహరీత ధివల ప్రసాంది రాగా పరిధిలోని దింగురా జియన్ వద్ద పల్సర్ బైకును లారీ ఢీకొట్టింది. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం
[ 20-05-2024]
నోట్ల కట్టలతో ఒక బ్యాగు లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ గదిలో ఓ కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికలు బహిష్కరించిన గుడియాపట్నా గ్రామస్థులు
[ 20-05-2024]
ఒడిశాలోని గంజాం జిల్లా కన్నొకెముండి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని గుడియా పట్నా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. -
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్.. డ్రైవర్ మృతి
[ 20-05-2024]
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమీపంలోని పుకిలి కూడలి వద్ద ఓ మినీ ట్రక్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. -
రెండో విడత పోలింగ్.. ప్రిసైడింగ్ అధికారిణికి అస్వస్థత
[ 20-05-2024]
ఒడిశాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుందర్గఢ్ జిల్లాలోని 211వ పోలింగ్కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిణి అస్వస్థతకు గురై కింద పడిపోయారు. -
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ