‘రాక్షస పాలనను సాగనంపాల్సిందే’
రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
విజయనగరం తోటపాలెం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వస్తున్న పీసీసీ, డీసీసీ ప్రతినిధులు రుద్రరాజు, రమేష్కుమార్ తదితరులు
విజయనగరం మయూరికూడలి, న్యూస్టుడే: రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సచివాలయ, వాలంటీరు వ్యవస్థను తెచ్చిందని, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే జీవో ఒకటిని ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అప్పట్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిందేనని అన్నారు. అనంతరం నాయకులతో కలిసి బాలాజీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టారు. చిరువ్యాపారులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, ఆటో కార్మికులకు కరపత్రాలు అందజేశారు. వారితో కలసి రెండు కి.మీ. వరకు ర్యాలీ చేశారు. డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్కుమార్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుంకర సతీష్ కుమార్, ఏఐసీసీ కో-ఆర్డినేషన్ సభ్యుడు శ్రీరామ్మూర్తి, జోడో యాత్ర ఇన్ఛార్జులు అంబటి కృష్ణ, పరమేశ్వరరావు, మైనార్టీ విభాగం నాయకులు షరీఫ్, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, సుంకర అప్పలనాయుడు, నియోజవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.