ఓటుందో.. లేదో చూసుకుందామా..
రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలపై ఉంది. జాబితాలో పేరుందా? లేదా? అని తనిఖీ చేసుకోవడం ఓటర్ల కనీస బాధ్యత.
* పార్వతీపురం మన్యం జిల్లా లక్ష్మీనారాయణపురం గ్రామంలో సున్నా ఇంటి నంబరుతో 30 ఓట్లు ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్డులో సున్నా ఇంటి నంబరుతో ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయని గత నెల 30న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఉప తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు.
*మార్చి 13 తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో విజయనగరంలో కస్పా ఉన్నత పాఠశాల కేంద్రంలో 33 మంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఓటేయడానికి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్చంద్ర పట్నాయక్ తన ఓటు రద్దు కావడంపై అధికారులను నిలదీశారు. ఛాలెంజింగ్ ఓటు ఇవ్వాలని కోరుతూ ఆయన పోలింగ్ కేంద్రం వద్దే నిరసన తెలిపారు. కావాలనే రద్దు చేశారని ఆరోపించారు. సంగీత కళాశాల పోలింగ్ కేంద్రంలో 80 ఓట్లు ఒకే పేరుతో రెండేసి ఉన్నట్లు గుర్తించారు.
ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేస్తున్న ఎన్నికల అధికారులు, బీఎల్వోలు (పాతచిత్రం)
విజయనగరం అర్బన్, విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలపై ఉంది. జాబితాలో పేరుందా? లేదా? అని తనిఖీ చేసుకోవడం ఓటర్ల కనీస బాధ్యత. ఏమాత్రం అలక్ష్యం చేసినా.. రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024లో భాగంగా శుక్రవారం నుంచి నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయనున్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల తమ పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని ఓటర్ల ఆరోపణలు ఉన్నాయి. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో సంతకం చేయడం రాని వారు కూడా పట్టభద్రుల ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రతిపక్షాలకు గొప్ప అవకాశం
పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ఏజెంట్లు బీఎల్వోల వెంట వెళ్లి తనిఖీలో పాల్గొనేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల రోజులు ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో వారు గుర్తించిన అవకతవకలను సరిచేయించొచ్చు. అర్హులు ఓటు హక్కు కోల్పోకుండా చూడొచ్చు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఇతర నకిలీ ఓట్లను ఆధారాలు చూపించి జాబితా నుంచి తొలగించేలా చేయొచ్చు. అర్హులకు ఓటు హక్కు లేకపోతే వారి వివరాలను నమోదు చేయించొచ్చు. అర్హులైన వారివి తొలగించి ఉంటే మళ్లీ దరఖాస్తు చేయించొచ్చు. ఒకే డోర్ నంబరుతో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు ఉంటే వాటిని తొలగింపజేయొచ్చు. అక్టోబరు 17న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. అందులో అర్హులకు ఓటు లేకపోతే అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకూ క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించొచ్చు. అవన్నీ పరిగణనలోకి తీసుకుని 2024 జనవరి 5న ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. దానిలో లోపాలున్నా దరఖాస్తు చేయించి సరిచేయించొచ్చు.
సున్నా ఇంటి నంబరుతో ఉన్నా, ఒకే ఇంటి నంబరుతో ఎక్కువ ఓట్లు ఉన్నా, వందేళ్లు పైబడిన ఓట్లను ప్రధానంగా పరిశీలించనున్నారు. ఇటువంటి వారిని గుర్తించి ఫారం-8లో నమోదు చేసి దరఖాస్తు చేయిస్తారు. ఈ మూడు కేటగిరీల వారు సర్వేలో ఓటును సరిచేసుకునేలా చైతన్యవంతులు కావాల్సి ఉంది.
ఇంత మంది ఉన్నారు
2023 సమగ్ర సవరణ జాబితా ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 15,12,129 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ఆధారంగా సర్వే చేయనున్నారు. విజయనగరం జిల్లాలో 1848 మంది బీఎల్వోలు సర్వేలో పాల్గొంటున్నారు.
వీటిని చూసుకోవాలి..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి ఉంది.
* ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు ఉండదు.
* దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్ల మీద ఆ ప్రాంతంలో ఓటుహక్కు లేకపోవచ్చు.
* బతికున్న వారికి ఉండవు.
* ఏళ్ల కిందట చనిపోయిన వారికి ఇంకా ఓటు హక్కు ఉండవచ్చు.
* గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్లు ప్రస్తుత జాబితాలో కనిపించకపోవచ్చు.
* కుటుంబంలో కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రంలో ఉంటే మరికొందరివి వేరే కేంద్రాల్లో ఉంటాయి.
* మరికొన్ని కుటుంబాల్లో ఓట్లు గల్లంతయ్యాయి.
* ఒకే ఇంటి నంబరులో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు జాబితాలో నమోదైన పరిస్థితి ఉంది.
* జాబితా నుంచి ఓటు తొలగించడానికి ముందు వారికి తప్పనిసరిగా అధికారులు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
* మరణించిన ఓటర్లు పేర్లను సంబంధిత కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చిన అనంతరం తొలగించాలి.
ప్రజలు సహకరించాలి
బీఎల్వోలకు ప్రజలు సహకరించాలి. ఇంటింటికీ వచ్చి ఓటర్ల జాబితాలను తనిఖీ చేస్తారు. పూర్తి సమాచారం అందించడం ద్వారా తప్పొప్పులకు తావులేని ఓటర్ల జాబితా రూపొందించడానికి వీలు కలుగుతుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లు తనిఖీల్లో పాల్గొనవచ్చు.
నాగలక్ష్మి, కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగునీటి వనరులపై..చిన్నచూపేలా?
[ 17-05-2024]
జిల్లాలో సహజ వనరులకు లోటు లేదు. ఎక్కడికక్కడ నదులు.. వాగులు.. చెక్డ్యాంలు ఉన్నా.. పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. -
పురపాలిక నిధులతోనే అత్యవసర సేవలు
[ 17-05-2024]
అత్యవసర సేవలకు పురపాలిక నిధులే ఖర్చు చేస్తున్నామని మున్సిపల్ ప్రాంతీయ సంచాలకుడు నాగరాజు అన్నారు. మండలంలో గురువారం పర్యటించిన ఆయన తొలుత కమిషనర్ ఛాంబర్లో కూర్చుని అధికారులతో మాట్లాడారు. -
పౌరాణిక పాత్రలు.. గాయనిగా పాటలు
[ 17-05-2024]
పార్వతీపురం మండలంలోని బాలగుడబ గ్రామానికి చెందిన పౌరాణిక కళాకారిణి కొప్పర మంగాదేవి(మంగమ్మ) ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు. -
‘మిథ్యా’లయం!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. -
ఓటరు తీర్పుపై ఎవరి ధీమా వారిదే..!
[ 17-05-2024]
ఎన్నికల యుద్ధం ముగిసింది.. పోటీలో తొలి నుంచి అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదిలారు. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. -
పట్టణవాసిపై పన్ను బాదుడు
[ 17-05-2024]
చంద్రబాబు హయాంలో అద్దె ప్రాతిపదికన పన్నులు విధించేవారు. ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకునేవారు. నామమాత్రపు వార్షిక పన్ను వసూలు చేసేవారు. -
షట్టర్లు ఇలా.. నీరు పారేదెలా?
[ 17-05-2024]
సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారికంగా 38,500 ఎకరాల ఆయకట్టుకు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. -
ఆ విపత్తు నుంచి ఎంతో నేర్చుకున్నా
[ 17-05-2024]
‘ఏడాది పాటు ఎంతో నేర్చుకున్నా. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది’ అని జిల్లా సహాయక కలెక్టర్ బి.సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. -
అదనపు దూరం... తప్పని భారం
[ 17-05-2024]
పాలకొండ ఆర్టీసీ డిపో గతంలో రీజియన్లోనే ఆదాయంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ కొన్ని ఏళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. -
డోలీలోనే గర్భిణి ప్రసవం
[ 17-05-2024]
గిరిజనులు అత్యవసర వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి డోలీ మోతలు తప్పడం లేదు. జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ఎస్.కోట నియోజకవర్గంలో మరోసారి ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంకెప్పుడు వేస్తారో..?
[ 17-05-2024]
కురుపాం మండలం పొడి పంచాయతీ సంతోషపురం కూడలి నుంచి మీగడ గ్రామం వరకు రూ.1.90 కోట్ల ఉపాధి నిధులతో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గత ఏడాది జులై 25న భూమిపూజ చేశారు. -
ఎఫ్సీఐ పేరిట బెదిరింపులు
[ 17-05-2024]
ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఆహార కల్తీ నియంత్రణ శాఖ) పేరిట ఓ హాటల్ యాజమాన్యాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్సై హరిబాబు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?