logo

Parvathipuram: రైలు వేగానికి ఎగిరిపడి వ్యక్తి దుర్మరణం

పట్టాల పక్కనుంచి నడిచి వెళుతున్న ఓ వ్యక్తి రైలు వేగానికి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Updated : 07 Oct 2023 08:00 IST

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టాల పక్కనుంచి నడిచి వెళుతున్న ఓ వ్యక్తి రైలు వేగానికి ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన మండలంలో జరిగింది. ఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. పెంట గ్రామానికి చెందిన గుల్ల తిరపతి(40) శుక్రవారం సమీపంలో ఉన్న పట్టాల పక్క నుంచి పొలానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈక్రమంలో రైలు వచ్చింది. ఆ వేగానికి తుళ్లిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని