కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం
విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు.
వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్
సమావేశంలో మాట్లాడుతున్న గౌరీశంకర్
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. ‘అప్పులు తీసుకో.. ఆస్తులు సమర్పించుకో’ అన్న రకంగా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతని వద్ద అప్పులు తీసుకున్న వారిలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలోని 30 మంది వరకు బాధితులున్నారని చెప్పారు. రైల్వే మూడోలైన్ కోసం జరిగిన భూసేకరణలో రూ.3 కోట్లకు పైగా లాగేశారని ఆరోపించారు. నీతి, నిజాయతీ గల పూసపాటి కుటుంబ సభ్యులు మహరాజా కళాశాల, సంగీత కళాశాల, సంస్కృత కళాశాల, 200 ఎకరాలకు పైగా ఉన్న కోరుకొండ సైనిక పాఠశాలను దానం చేశారని గుర్తు చేశారు. ఆక్రమణలు తప్ప అభివృద్ధి తెలియని కోలగట్లకు వారితో పోలికేంటని ప్రశ్నించారు. ఈ నెల 24న జరిగిన ప్రజాగళం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. చెల్లూరులో జరిగిన జగన్ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు పెట్టినా ఎవరూ వెళ్లలేదని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీయూలో సర్కార్ వైద్యం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మాటిచ్చిన ఆయన ఆసుపత్రులు, రోగుల సమస్యలను పట్టించుకోలేదు. -
బోద కనపడదా.. బాధ వినపడదా?
[ 11-05-2024]
జిల్లాలో ఫైలేరియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో బలిజిపేట మండలం పెదపెంకి ఒకటి. వ్యాధి బారిన పడి ఎందరో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు