logo

సంక్షేమ పథకాల పేరుతో జగన్‌ మభ్యపెట్టారు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వారి చేతికి చిప్ప ఇస్తున్నారంటూ తెలగ, బలిజ, కాపు దక్షిణ భారత కన్వీనర్‌ దాసరి రాము ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 01 May 2024 03:35 IST

తెలగ, బలిజ, కాపు సౌత్‌ ఇండియా కన్వీనర్‌  

సమావేశంలో మాట్లాడుతున్న రాము

 భోగాపురం, న్యూస్‌టుడే: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వారి చేతికి చిప్ప ఇస్తున్నారంటూ తెలగ, బలిజ, కాపు దక్షిణ భారత కన్వీనర్‌ దాసరి రాము ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ముంజేరులో జనసేన పార్టీ కార్యాలయ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ కులాల మద్దతు కూటమి అభ్యర్థికి ఇవ్వాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వంతో అన్ని వర్గాల వారు నష్టపోయారన్నారు. ఇప్పటికైనా పేద, మధ్యతరగతి ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం నాగమాధవిని గెలిపించాలని కోరారు. గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ జనసేన కన్వీనర్‌ చందక రామదాసు, తెలగ జిల్లా కన్వీనర్‌ మురళీ, తెలుగు నాడు ట్రేడ్‌ యూనియన్‌ కన్వీనర్‌ జగన్నాథ్‌, అయ్యప్పరెడ్డి, నర్సింగరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని