వాలంటీర్పై కత్తితో దాడి
వాలంటీర్, వైకాపా కార్యకర్తకు మధ్య జరిగిన వివాదంలో కార్యకర్త కుమారుడు జోక్యం చేసుకొని వాలంటీర్పై కత్తితో దాడి చేశాడు.
గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు
జరుగుమల్లి, న్యూస్టుడే: వాలంటీర్, వైకాపా కార్యకర్తకు మధ్య జరిగిన వివాదంలో కార్యకర్త కుమారుడు జోక్యం చేసుకొని వాలంటీర్పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం పీరాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపి మండలం జాళ్లపాలెం, పీరాపురం గ్రామాల మధ్యలోని వాగు పోరంబోకు భూమిలో పీరాపురానికి చెందిన మారంరెడ్డి వెంకటేశ్వర్లు చికెన్ దుకాణం ఏర్పాటు చేసుకొనేందుకు శుక్రవారం ఉదయం నిర్మాణ పనులు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ మారంరెడ్డి గంగాధర్ విషయం తెలుసుకొని అక్కడకు వచ్చి పనులు చేపట్టవద్దని సూచించారు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. కొంత సమయం తరువాత వాలంటీర్ పంచాయతీ కార్యదర్శి శ్రీహరితో అక్కడకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కుమారుడు బ్రహ్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వెంట తెచ్చుకున్న కత్తితో వాలంటీర్పై దాడి చేశాడు. భయంతో చేతులు అడ్డుగా పెడ్డటంతో ఎడమ చేతికి బలమైన గాయమైంది. స్థానికులు 108 ద్వారా ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా గ్రామంలో ముగ్గురు పోలీసులతో పికెట్ ఏర్పాటుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్