రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు.
ఫార్మా హబ్గా ప్రకాశాన్ని తీర్చిదిద్దుతాం
ఆయన జనం ‘చెవి’లో పువ్వులు పెట్టే ‘రెడ్డి’
యువగళం సభలో నారా లోకేశ్
యువతతో మాట్లాడుతున్న తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్
ఈనాడు, ఒంగోలు: ‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపించి ప్రకాశం జిల్లా తెదేపా అడ్డా అని నిరూపిద్దాం. అధికారంలోకి రాగానే జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఫార్మా హబ్గా అభివృద్ధి చేసి యువతకు జిల్లాలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం..’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జిల్లా యువతకు భరోసా ఇచ్చారు. ఒంగోలులో మంగళవారం నిర్వహించిన యువగళం ఎన్నికల సమరభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఒక్క అవకాశం అన్న మాటకు ప్రజలు పడిపోయి వైకాపాను గెలిపించారన్నారు. గద్దెనెక్కిన జగన్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. అయిదేళ్లలో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు ఒంగోలు నుంచే ప్రారంభమైందని, మరో పన్నెండు రోజుల్లో సైకో పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతపురంలో కియా మోటార్స్ను చంద్రబాబు తెస్తే, జగన్ గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. మైకు పట్టుకుని మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా ప్రజల పక్షాన పోరాడేవారందరి పైనా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశానికి అధిక నిధులు ఖర్చుచేశామని, ఒంగోలులో దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో రూ.2,500 కోట్లు అభివృద్ధికి వెచ్చించామన వివరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెవిలో పువ్వుల రెడ్డని, ఆయన అక్కడ ఎర్రచందనం కొల్లగొట్టి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేక ఇక్కడికి వచ్చి ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని యువతను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 4 ఇంకా రాదేమి!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసి వారమైంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్లలో పదిలంగా ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో విజేతలెవరనేది తేలిపోతుంది. -
ప్రమాదంలో తపాలా తీర్పు!
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓట్లు నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలు స్ట్రాంగ్రూముల్లో కేంద్ర సాయుధ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు పహారాలో ఉన్నాయి. వీటి భద్రతపై అనుమానాలు లేవు. -
ఊరికో వైకాపా ‘మారీ’చుడు
[ 21-05-2024]
వైకాపా నేతలు ఇసుక, మట్టిలో తెగ మేశారు. సహజ వనరులను కొల్లగొట్టి నమిలి మింగారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- జిల్లాలో అధికారికంగా ఒక్క రీచ్ కూడా లేకున్నా.. ఇసుక లభించే ప్రాంతాలను పంచేసుకున్నారు. -
జిల్లా జల్లెడ
[ 21-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. సోమవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత
[ 21-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన నేపథ్యంలో ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణానికి సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను కల్పించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హర్షిత.. స్వర్ణ విజేత
[ 21-05-2024]
జాతీయ స్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థిని నూకసాని హర్షిత సత్తా చాటి బంగారు పతకం కైవనం చేసుకుంది. -
రూ. కోట్ల వ్యయం.. నిర్లక్ష్యమే ఘనం
[ 21-05-2024]
రూ. కోట్ల వ్యయంతో చేపట్టే పనుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో అవి ఎవరికీ ఉపకరించడం లేదు. ముందుచూపు లేకుండా మొక్కుబడిగా చేయడంతో ఎవరికీ అక్కరకు రావడం లేదు. మార్కాపురంలోని సప్లయ్ ఛానల్ పనులే దీనికి సజీవ సాక్ష్యం. -
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన
[ 21-05-2024]
మండలంలోని రామాపురంలో పట్టాభి రామస్వామి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను అంబాల చినవెంకటరెడ్డి, నిర్వాహకులు ప్రారంభించారు. -
గుండ్లకమ్మ నదా! డంపింగ్ యార్డా..!!
[ 21-05-2024]
మార్కాపురం పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది పెద్ద డంపింగ్ యార్డుగా మారింది. పట్టణంలోని నివాసాల నుంచి సేకరించిన చెత్తను నదిలో పడేస్తుండటంతో నది కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్