logo

తెదేపాలోకి ఇద్దరు కార్పొరేటర్లు

ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు.

Published : 04 May 2024 06:20 IST

]

దామచర్ల జనార్దన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కార్పొరేటర్లు షేక్‌ నూర్జహాన్‌, వేమూరి భవానీ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. ఒంగోలులోని 4, 48వ డివిజన్‌ కార్పొరేటర్లు షేక్‌ నూర్జహాన్‌, వేమూరి భవానీ స్థానిక గుంటూరురోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ సమక్షంలో చేరారు. వారితోపాటు, ఒకటో డివిజన్‌కు చెందిన వైకాపా నాయకులు కోమటినేని వీరభద్రరావు, చిడిపోతు అనిల్‌, కంటు రామారావుతోపాటు, 50 కుటుంబాలు పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని