నిత్యం పరేషాన్
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు.
ఇంటింటికీ బియ్యం ఊసేలేదు
రేషన్ సరఫరా అస్తవ్యస్తం
వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు
ఒంగోలులో ఒకేచోట ఎండీయూ వాహనం నిలిపి బియ్యం పంపిణీ
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు. వీధిలో ఓ వైపు నిలిపి పంపిణీ చేయడంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిత్యావసరాల ధరలు మండుతున్న వేళ కందిపప్పునకు ఎగనామం పెట్టడంతో పేదలకు దిక్కుతోచడం లేదు.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: జిల్లాలో 1392 రేషన్ దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో 6,55,525 బియ్యం కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలకు ప్రతి నెలా అర కిలో పంచదార, కిలో కందిపప్పు రాయితీపై అందిస్తోంది. కార్డులోని కుటుంబ సభ్యులకు అయిదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికే ఇస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాయితీ బియ్యాన్ని కొనసాగిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను నిలుపుదల చేసి ఉచితంగా పంపిణీ చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి నెలా పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి స్థానిక రేషన్ దుకాణాలకు సరకుల తరలిస్తారు. కార్డుదారులకు సరఫరాను బట్టి సదరు డీలర్లు ఎండీయూ వాహనాలకు సరకులు అందిస్తారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 385 ఎండీయూ వాహనాలను కేటాయించారు. వాటి ద్వారా ఇంటింటికి సరకులు అందజేసే బాధ్యత ఆపరేటర్లదే.
అన్నీ అసౌకర్యాలే!
ఎండీయూ వాహనం ఇంటికొస్తుందన్న ప్రభుత్వ ప్రచారమే తప్ప..ఎక్కడా అమలు కావడం లేదు. దీనికితోడు ఇంటి దగ్గర ఉన్నవారికే సరకులు అందుతున్నాయి. ఇక కూలి పనులకు వెళ్లే వారు బండి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరో పక్క వృద్ధులు, దివ్యాంగులు వీధి చివరికి వెళ్లి సరకులు తెచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇంటి వద్దకే సరకులు అంటూ వాహనాలు తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి భారం తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం లేదని కార్డుదారులు వాపోతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన జిల్లా అధికార యంత్రాంగం ఆ బాధ్యతను గాలికొదిలేసింది.
రెండేళ్లుగా కందిపప్పు ఊసే లేదు
ప్రతి నెలా కార్డుదారులకు సరఫరా నిమిత్తం జిల్లాకు 655 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం కాగా, అందుకు గత రెండేళ్లుగా నెలకు సరాసరిన 100 నుంచి 150 మెట్రిక్ టన్నుల మాత్రమే కేటాయించారు. దీంతో పురపాలక, మండల కేంద్రాలకు ప్రాధాన్యాన్నిచ్చి అక్కడ పంపిణీ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా లేకపోవడంతో కార్డుదారులకు స్వస్తి చెప్పారు. బయట మార్కెట్లో ఉప్పు నుంచి పప్పుల వరకు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుదారులు రేషన్ దుకాణాల్లో ఇచ్చే సరకులపైనే ఆధారపడుతున్నారు.
బహిరంగ మార్కెట్లో కిలో రూ.180
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కందిపప్పు కిలో రూ.180 వరకు పలుకుతోంది. పౌర సరఫరాల దుకాణాల ద్వారా రాయితీ పోనూ కిలో రూ.67కే ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రాయితీని ప్రభుత్వం భరించలేక పప్పు సరఫరా ఆపేసింది. కిలోతోనే పేద కుటుంబాలు నెలంతా నెట్టుకొచ్చేవారు. మరోపక్క బయట మార్కెట్లో పెరిగిన ధరకు కొనుగోలు చేయడం పేదలకు భారంగా మారింది. గత పది నెలలుగా పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తుండగా, అది కూడా నాలుగోవంతు మందికే అందించి చేతులు దులుపుకుంటున్నారు.
ఇచ్చేది తక్కువ..కొనేదే ఎక్కువ
సాధారణంగా రేషన్ పంపిణీ చేసే సమయంలో డీలర్ తప్పనిసరిగా సహాయకుడిని కూడా పెట్టుకోవాలి. అయితే వాహనాల వెంబడే రేషన్ డీలర్లు ఉంటున్నారు. వారే సహాయకుడి పాత్ర పోషిస్తున్నారు. బియ్యాన్ని దాదాపు 80 శాతం మంది తీసుకోవడం లేదు. కార్డుదారుల నుంచి బయోమెట్రిక్ నమోదు చేసి వారికి కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకూ ముట్టజెప్పి ఆ బియ్యాన్ని డీలర్లు తమ వద్దే ఉంచేసుకుంటున్నారు. దీంతో రేషన్ సరఫరా అంతా అభాసు పాలవుతోంది. ఎక్కువ ప్రాంతాల్లో డీలరు, ఆపరేటర్ కలిసే బియ్యం కొనుగోలు చేస్తుండగా; మరికొన్ని చోట్ల వేర్వేరుగా సేకరిస్తున్నారు. వాటిని ఆ రోజు డిమాండ్ను బట్టి కిలో రూ.16 నుంచి రూ.20 వరకు బయటి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇక పంచదార ప్రతి కుటుంబానికి అర కిలో ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దీని ధర ఎక్కువగా ఉండటంతో కార్డుదారులందరూ తప్పనిసరిగా దీన్ని తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు
[ 18-05-2024]
ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ బూత్లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
[ 18-05-2024]
పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. -
పండగలా సొంతూళ్లకొచ్చారు
[ 18-05-2024]
2024 సార్వత్రిక రణంలో ఓటర్లు ‘స్థానిక’ సమరం తరహా ఉత్సాహం చూపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది. తక్కువ ఓట్లు ఉండటంతో ప్రతి ఒక్కటీ కీలకంగా భావిస్తారు. -
కొలువులకు చదువే సరిపోదు
[ 18-05-2024]
ఇది పోటీ ప్రపంచం.. నెగ్గుకు రావాలంటే అన్నింటా ఇతరులను మించి అదనపు అర్హతలు తప్పనిసరి. అందులోనూ కొలువులు సాధించాలంటే చదువొక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యమూ అవసరం. అది సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగ, ఉపాధి పొందవచ్చు. -
ఓటు వరకే నీళ్ల నాటకం
[ 18-05-2024]
ఎన్నికలు ముగియడంతో ఓటర్లతో ఇక పనేముందని వైకాపా అభ్యర్థులు, నేతలు అనుకుంటున్నారు కాబోలు. ఇన్ని రోజులు వారి చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీళ్లు సరఫరా చేయించారు. -
స్ట్రాంగ్రూమ్లను రోజూ సందర్శించండి
[ 18-05-2024]
ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఘాట్లో ప్రమాద ఘంటికలు
[ 18-05-2024]
ఎతైన కొండలు, లోతైన లోయలు, వంపులతో కూడిన మలుపులు ఉన్న నల్లమల లోని శ్రీశైలం రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మూల మలుపుల వద్ద చోదకులు వాహనాల వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఓట్లు వేయలేదనే వైకాపా దాడులు
[ 18-05-2024]
-
ఉపాధి చూపే బండే ఊపిరి తీసింది..
[ 18-05-2024]
ఐస్క్రీం బండిలో ఐస్క్రీంలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ యువకుడిని అదే బండి ప్రాణం తీసింది. ఐస్క్రీం బండికి విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని గణపవరంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
బాలికపై అత్యాచారం
[ 18-05-2024]
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన చిన్నదోర్నాలలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్సై అంకమ్మరావు తెలియజేసిన వివరాల మేరకు.. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్