logo

జగన్‌కు జిల్లా ‘రివర్స్‌’ షాక్‌

సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్‌’ షాక్‌లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్‌ గెలుపు కోరుతూ జగన్‌ ప్రచారం చేశారు.

Published : 04 May 2024 06:30 IST

ప్రసంగిస్తున్న జగన్‌.. చిత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ

న్యూస్‌టుడే, కనిగిరి: సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్‌’ షాక్‌లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్‌ గెలుపు కోరుతూ జగన్‌ ప్రచారం చేశారు. ఈ సభ జనం లేక పూర్తిగా వెలవెలబోయింది.హెలీప్యాడ్‌ వద్దకు వచ్చే సమయానికి కూడా సభాస్థలిలో 500 మంది కూడా లేకపోవడంతో నేతలు, అభ్యర్థులు సమీపంలో ఉన్న వారిని సమీకరించుకుని వచ్చేందుకు నానాపాట్లు పడ్డారు. వారిలోనూ పలువురు జగన్‌ ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. కనిగిరిలో వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ తరఫున శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోనూ అదే పరిస్థితి. జగన్‌ మాట్లాడటం ప్రారంభించిన అయిదు నిముషాలకే పలువురు వెనుదిరిగి వెళ్లడం కనిపించింది. ప్రసంగం పూర్తయ్యే సమయానికి ఆ ప్రాంతం సగానికి పైగా ఖాళీ కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని