పాలబుగ్గలపైనా పాలకుడి పగ
ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు..అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు.
చిన్నారులు విలవిల.. ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి
ప్రాథమిక విద్యకు విలీనం దెబ్బ
ఒంగోలు నగరం, న్యూస్టుడే
ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు.. అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు. బుడిబుడి అడుగులేసే వారిపైనా ఆయన కత్తిగట్టడం ఏమిటని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి కాసులు మిగుల్చుకునేందుకే దీనికి ఒడిగట్టారని వారు ఆవేదన చెందుతున్నారు.
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రాథమిక విద్య కుదేలవ్వడంతో ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా ప్రైవేటు పాఠశాలలకు మేలు జరిగింది. ఆయన రెండేళ్ల క్రితం 117 జీవో జారీ చేసి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీనిద్వారా మూడు నుంచి పదో తరగతి వరకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ని నియమించి మెరుగైన బోధన చేస్తామంటూ గప్పాలు పలికారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్నత పాఠశాల ఉంటే ఆ సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల పిల్లలను అందులో విలీనం చేశారు.
విలీనమైన సీఎస్పురంలోని ఎ.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల
ప్రమాదకర రహదారులున్నా..
కాలువలు, ప్రమాదాలకు ఆస్కారమున్న జాతీయ రహదారులు అడ్డుగా ఉన్నచోట విలీనం చేయవద్దని మార్గదర్శకాల్లో పేర్కొన్నా వాటిని పాటించకుండా ఇష్టారీతిన కలిపేశారు. ఉదాహరణకు త్రోవగుంట, పేర్నమిట్టలోని ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి మధ్యలో ప్రధాన రహదారులు దాటాలి. బుడిబుడి అడుగులేసే చిన్నారులు ఇవి దాటి ఎలా వెళ్లగలరన్న స్పృహ పాలకులకు కొరవడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేటు స్కూళ్లలో తమ చిన్నారుల్ని జాయిన్ చేశారు. ఆ విధంగా పిల్లలు తగ్గిపోయి పాఠశాలల్లో టీచర్పోస్టులు మిగులుగా తేలాయి. నిబంధన ప్రకారం 30 మందికి ఒక టీచర్ ఉండాలి. విలీనం తరువాత వందమంది ఉన్నచోట 40 మందికి పడిపోయారు. ఇలా ముగ్గురు టీచర్లు ఉన్న పాఠశాల ఒకరితో ఏకోపాధ్యాయగా మారిపోయింది. జిల్లాలో 310 పాఠశాలలు ప్రస్తుత ఒకే టీచర్తో నడుస్తున్నాయి.
డీఎస్సీలో పోస్టులకు మంగళం
మూడు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టు టీచర్లను నియమిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఉద్యోగోన్నతులు కల్పించనందున పలు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టీచర్లు లేక బోధన కుంటుపడుతోంది. దీనికి తోడు ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులను మిగులుగా చూపించడం వల్ల డీఎస్సీ నోటిఫికేషన్లో జిల్లాలో పోస్టులు లేకుండా పోయాయి. కేవలం 315 స్కూలు అసిస్టెంట్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. చివరికి అది కూడా జరగలేదు. ఎస్జీటీ పోస్టులు ఖాళీలు లేక పోవడంతో డీఎడ్ చదివిన సుమారు 7 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. వారికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది.
విలీన చిత్రం
- విలీనమైన ప్రాథమిక పాఠశాలలు : 404
- విలీనం చేసుకున్న ఉన్నత పాఠశాలలు : 272
- మిగులుగా తేలిన టీచర్లు : 1102 మంది (1080 పాఠశాలలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!