ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
రవీ.. నా అంతట నేనే చెబుతున్నాను. మహేషో., దుర్గారెడ్డో., కుమ్మిత అంజిరెడ్డినో నమ్మి అయితే మేము ఎలక్షన్ చేయట్లా.. నేను నీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకో.. నేనుగానీ, సార్గానీ, పెద్దామెగానీ దర్శి నాయకులను పెట్టుకుని ఎలక్షన్ చేయట్లేదు.
పోలింగ్ వరకే ఆ పెద్ద తలలు
వాళ్లని నమ్మి పోటీ చేయడం లేదు
దర్శి వైకాపా అభ్యర్థి సతీమణి నందిని మాటలు వైరల్
న్యూస్టుడే, ఒంగోలు
రవీ.. నా అంతట నేనే చెబుతున్నాను. మహేషో., దుర్గారెడ్డో., కుమ్మిత అంజిరెడ్డినో నమ్మి అయితే మేము ఎలక్షన్ చేయట్లా.. నేను నీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకో.. నేనుగానీ, సార్గానీ, పెద్దామెగానీ దర్శి నాయకులను పెట్టుకుని ఎలక్షన్ చేయట్లేదు. మాకు తెలుసు.. మేం 2014లో దెబ్బతిన్నది ఎక్కడో కూడా మాకు తెలుసు. అందుకుని వాళ్లను నమ్మి మేం ఎలక్షన్ చేయట్లేదు. వాళ్లని ఏంటంటే ఇరవై ఏళ్లుగా ఉన్నారు కాబట్టి, పెద్ద తలకాయలు పెద్ద తరహాగా ఉండాలి కాబట్టి వాళ్లని అలా అడ్డుపెట్టాము. అది గుర్తు పెట్టుకోండి’.. ఇవీ వైకాపా దర్శి నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సతీమణి నందిని చేసిన వ్యాఖ్యలు.
సుమారు రెండు నెలల క్రితం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన రవి అనే నాయకుడితో ఆమె మాట్లాడిన ఆడియో కాల్ ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పోలింగ్కు నాలుగు రోజుల ముందు విడులైన ఈ ఆడియో ఇప్పుడు దర్శి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏం వాగినా.. నస పెట్టినా భరిద్దాం: ఏఎంసీ మాజీ ఛైర్మన్ వెంకటరెడ్డి అలియాస్ మహేష్, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర బ్యూటీ, గ్రీనరీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డిలను ఉద్దేశిస్తూ బూచేపల్లి సతీమణి నందిని ఈ వ్యాఖ్యలు చేయడం., వాళ్లను నమ్ముకుని తాము ఎన్నికలకు రాలేదని, కాకపోతే ఈ రెండు నెలలు వాళ్లని భరించి ఆ తర్వాత పక్కన పెడదామనడం గమనార్హం. ‘వాళ్లు ఏం వాగినా, ఎంత నస పెట్టినా సరే.. బాస్కు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. ఆయన్ను మనం గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. రెండు నెలల తర్వాత ఎవడ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?