రాళ్లవాగును అటకెక్కించావు.. జగనూ
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు.
చిన్న రాయి కూడా వేయించలేక పోయావు
భూగర్భ జలాల పెంపు ఎలా?
అర్థవీడు, న్యూస్టుడే: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు. వర్షాధారంగా నల్లమల అడవుల్లోని వరదనీటితో ఈ జలాశయాన్ని నింపి..చుట్టూ పరిధి ఆరు గ్రామాల్లో రెండు వేల ఎకరాల సాగుతో పాటు ఈ ప్రాంత భూగర్భజలాల పెంపునకు ఈ ఆనకట్ట ప్రయోజనం కానుంది. అయితే గత ప్రభుత్వంలో రాళ్లవాగు ఆనకట్ట పనులు 20 శాతం చేయగా..తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో పనులను అటకెక్కించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆనకట్ట పనులకు అవసరమైన మట్టి, రాయి, ఇసుక తరలింపు టెండర్లలో గుత్తేదారుకు ధరలు కల్పించకపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. అప్పటి వరకు చేపట్టిన పనులు సైతం మూడేళ్ల క్రితం రాళ్లవాగుకు వరద రావడంతో ఆనకట్టలో నింపిన ఇసుక, మట్టి కొట్టుకుపోయింది. రాళ్ల కట్టడం సైతం పడిపోయింది. ఈ పనులు సకాలంలో పూర్తి చేసుంటే..పల్లెల్లో భూగర్భ జలాల పెంపునకు దోహదపడేవి.
నిలిచిపోయిన రాళ్లవాగు ఆనకట్ట నిర్మాణం
ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోయాయి
వెలుగొండ ప్రాజెక్ట్ కాకర్ల ఆనకట్ట జలాశయం నుంచి బొల్లుపల్లి, వెలగలపాయ లోయలకు వెలుగొండ జలాలను తరలించేందుకు సుమారు రూ.51 కోట్ల వ్యయంతో అనుమతులు పొందిన రెండు ఎత్తిపోతల పథకాలు వైకాపా నాయకులకు ఎన్నికల నజరాణాగా మరాయి. అర్థవీడు రెండు లోయలకు ఎలాంటి నీటి వనరులు లేవు. నల్లమల అడవుల్లో కురిసే వర్షంతో జంపలేరు, పెద్దవాగు వరద నీటితో అయిదు చెరువులు నిండుతాయి. ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకుంటే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుంది. కానీ వైకాపా నాయకులు ఓట్ల కోసం ఈ పథకాన్ని తెరపైకి తెస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
బోర్లు ఎండిపోతున్నాయి..
- రామయ్య, రైతు, బొల్లుపల్లి.
ఎత్తిపోతల పథకం కానీ..రాళ్లవాగు ప్రాజెక్ట్ గానీ సకాలంలో పూర్తి చేసుంటే మా ప్రాంతానికి భూగర్భజలాలు ఎండుముఖం పట్టేవి కాదు. ఆనకట్ట నిర్మాణం చేస్తున్నారంటే ఎంతో సంతోషపడ్డాం. కానీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ పనులను విస్మరించి ఈ అయిదేళ్లలో చిన్న రాయి కూడ అక్కడ వేయలేక పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా