logo

ఒక్క బస్సుతో రావడమెలా..

ఉప్పినవలస నుంచి పాలకొండ మార్గంలో సమయానికి బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ మార్గంలో 500 మందికి పైగా విద్యార్థులు చదువు కోసం

Published : 09 Dec 2021 04:22 IST

ఉప్పినవలస నుంచి పాలకొండ మార్గంలో సమయానికి బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ మార్గంలో 500 మందికి పైగా విద్యార్థులు చదువు కోసం నిత్యం వస్తున్నారని కేవలం ఒక్క బస్సే నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఒక్కటీ ఎప్పుడొస్తుందో తెలియడం లేదన్నారు. ఈ విషయమై డీఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. 

- న్యూస్‌టుడే, పాలకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని