logo

సైనికుల సేవలు చిరస్మరణీయం

దేశ రక్షణలో సైనికులు అందించే సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి పి.సీతారామ్మూర్తి పేర్కొన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం నగరంలోని చేనేత బజార్‌లో సుభాష్‌ చంద్రబోష్‌ జయంతి

Published : 24 Jan 2022 03:27 IST

చేనేత వస్త్రాలు అందజేస్తున్న డీఆర్‌వో సీతారామ్మూర్తి

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: దేశ రక్షణలో సైనికులు అందించే సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి పి.సీతారామ్మూర్తి పేర్కొన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం నగరంలోని చేనేత బజార్‌లో సుభాష్‌ చంద్రబోష్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన నాయక్‌ వంజరాపు రామారావు కుటుంబ సభ్యులకు చేనేత వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆప్కో పరిశీలకులు హరిప్రసాదరావు మాట్లాడుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న కుటుంబ సభ్యులకు ఈ నెల 29వ తేదీ వరకు ఆప్కో వస్త్రాలపై 40 శాతం తగ్గింపు ధరలను అమలు చేస్తున్నామని చెప్పారు.
వంజరాపు రామారావు కుటుంబ సభ్యులకు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని