గురువుల ముఖాలు గుర్తుంచలే..!
విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొస్తున్న యాప్లపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా మంగళవారం నుంచి తెరపైకి వచ్చిన ముఖ హాజరు యాప్తోనూ అవస్థలు తప్పలేదు
నరసన్నపేట: సత్యవరం ఉన్నత పాఠశాలలో బయటకొచ్చి ఉపాధ్యాయుల పాట్లు..
విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొస్తున్న యాప్లపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా మంగళవారం నుంచి తెరపైకి వచ్చిన ముఖ హాజరు యాప్తోనూ అవస్థలు తప్పలేదు. పాఠశాల ప్రాంగణంలో తమ చరవాణిలోని యాప్లో ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసేందుకు వారు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. నిర్ణీత సమయానికి చాలామంది హాజరు నమోదు చేసుకోలేకపోయారు. నిత్యం పాఠశాల సమయంలో యాప్లతో కుస్తీ పట్టడమే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ హాజరు నమోదులో జిల్లా తొలిరోజు రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో యాప్లో ఉపాధ్యాయుల వివరాలను కూడా నమోదు చేసేందుకు కుదరలేదు. మంగళవారం పాఠశాలలకు వెళ్లేసరికి వివరాలు నమోదు చేసేందుకు యాప్ సహకరించలేదు. ఈ క్రమంలో కేవలం 40.32 శాతం మాత్రమే తొలిరోజు వివరాలు నమోదు చేసుకోగలిగారు. వారిలోనూ కొందరే హాజరు వేశారు. ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయడానికి ప్రధానోపాధ్యాయులు నానా తంటాలు పడ్డారు. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయగా కొంత పూర్తయిన తరువాత యాప్ క్లోజ్ అయిపోతోందని చెబుతున్నారు. అప్పుడు మళ్లీ మొదటికి రావడంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు.
నెట్వర్క్ లేక ఇబ్బందులు... ముఖహాజరు నమోదుకు నెట్వర్క్ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు సొంత చరవాణిలో నమోదు చేయాలనడం సరికాదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణించడం, జీతంతో ముడిపెట్టడం సమంజసం కాదు. ప్రభుత్వం ఇందుకు తగిన నెట్వర్క్ పరికరాలను ఏర్పాటు చేయాలి. ఆ తరువాతే నిబంధనలు అమలు చేయాలి.
- చౌదరి రవీంద్ర, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
రద్దు చేయాలి... విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోతున్నాం. ఒక పూటంతా యాప్లతోనే సరిపోతోంది. అన్ని రకాల యాప్లను రద్దు చేయాలి. ముఖ హాజరును సొంత మొబైల్ ద్వారా వేయాలనడం సరికాదు. ఉపాధ్యాయుల హాజరు ఆన్లైన్ ద్వారా తప్పనిసరి అయితే కచ్చితంగా ప్రభుత్వమే అందుకు తగిన పరికరాలు అందజేసి సమస్య లేకుండా చూడాలి.
- మజ్జి మదన్మోహన్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?