logo

ఇనుప కండరాలు..

23వ మిస్టర్‌ ఆంధ్రా బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2022 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

Published : 28 Nov 2022 04:10 IST

23వ మిస్టర్‌ ఆంధ్రా బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2022 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇచ్ఛాపురం పురపాలక బాలికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాలలో ప్రదర్శనలు నిర్వహించి విజేతలను గుర్తిస్తామని నిర్వాహక సంస్థ రాయల్‌ స్క్వాడ్‌ ప్రతినిధులు ఎం.శ్రీకాంత్‌రెడ్డి, ఎన్‌.కోటేశ్వరరావు తెలిపారు. న్యాయవాది ఎం.రాంబాబు, డా.వెచ్చా చలమాజీ(సంతోష్‌), కౌన్సిలర్‌ బచ్చు జగన్‌ ప్రారంభించారు.

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని