logo

హడలెత్తించిన మంటలు

అది మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయం.. జేఆర్‌పురం పాత పెట్రోలు బంకు వద్దకు డీజిల్‌తో నిండి ఉన్న ట్యాంకరు లారీ వచ్చింది.. వెంటనే ఇంధనాన్ని అన్‌లోడ్‌ చేసేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు.

Published : 30 Nov 2022 05:57 IST

అది మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయం.. జేఆర్‌పురం పాత పెట్రోలు బంకు వద్దకు డీజిల్‌తో నిండి ఉన్న ట్యాంకరు లారీ వచ్చింది.. వెంటనే ఇంధనాన్ని అన్‌లోడ్‌ చేసేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. ఇంతలోనే లారీ క్యాబిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దీంతో బంకు వద్ద ఉన్న వారంతా ఉరుకులు, పరుగులు తీశారు. పేలిపోతుందేమోనని అందరూ ఆందోళన చెందారు. వెంటనే తేరుకున్న బంకులోని సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలు లారీ అంతా వ్యాపించి ఉంటే నష్టం భారీగా ఉండేది. 

 - న్యూస్‌టుడే, రణస్థలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని