అక్కుపల్లిలో ఎలుగు దాడి!
వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లికి చెందిన జీడి రైతు సూరాడ లోకనాథంపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
తీవ్రంగా గాయపడిన జీడి రైతు
పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లో కనాథం
వజ్రపుకొత్తూరు, న్యూస్టుడే: వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లికి చెందిన జీడి రైతు సూరాడ లోకనాథంపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లోకనాథం సోమవారం ఉదయం జీడి పిక్కలు ఏరేందుకు తోటకు వెళ్లారు. పిక్కలు సేకరించి తిరిగి వస్తుండగా పిల్లతో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతని మీద పడింది. తప్పించుకునేలోపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే బాధితుడు కేకలు వేయడం, అక్కడ ఉన్న కుక్కలు మొరగడంతో సమీప తోటల్లో ఉన్న రైతులు వచ్చారు. అప్పటికే ఎలుగుబంటి పిల్లతో పాటు వెళ్లిపోయింది. క్షతగాత్రుడిని హుటాహుటిన పలాస సామాజిక ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్ అధికారి బీవీబీ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితుడి, కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వైద్యఖర్చులతో పాటు ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉద్దానాన్ని వీడని భయం..
ఉద్దానం వాసులకు ఎలుగుబంట్ల బెడద తప్పడం లేదు. ఈ ప్రాంతంలో గతేడాది ఇదే నెల 19, 20వ తేదీల్లో కిడిసింగి, వజ్రపుకొత్తూరు తోటల్లో జరిగిన ఎలుగు దాడి ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఆ ఘటనలు తలచుకుంటునే స్థానికులు భయపడిపోతున్నారు. అప్పట్లో ప్రత్యేక బృందాలు వచ్చి ఎలుగును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సోమవారం జరిగిన దాడితో ఉద్దానంలో ఎలుగుబంట్ల కలకలం మొదలైంది. తోటలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. జిల్లా అటవీ శాఖాధికారులు స్పందించి నివారణకు చర్యలు తీసుకోవాలని ఉద్దానం ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిత్రుడి కుటుంబానికి ఆపన్న హస్తం
[ 11-05-2024]
మండలం పరిధి ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేష్ పోలాండ్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. -
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 11-05-2024]
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యులు ఎల్.సుధాకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు