logo

దయచేసి వినండి.. లిఫ్ట్‌ పని చేయదండి..!

ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ సరిగా పని చేయడం లేదు. విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ఎప్పటికప్పుడు నిలిచిపోతోంది.

Updated : 27 Mar 2024 05:18 IST

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం: ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ సరిగా పని చేయడం లేదు. విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ఎప్పటికప్పుడు నిలిచిపోతోంది. ప్రయాణికులు ప్లాట్‌ఫాంలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు సరఫరా ఆగితే రీఛార్జ్‌ అయిన బ్యాటరీలతో పని చేయాలి. అవి కూడా మరమ్మతులకు గురయ్యాయి. లిఫ్ట్‌ కింద జనరేటర్‌ ఏర్పాటు చేసినా కనెక్షన్‌ ఇవ్వలేదు. ఈ విషయమై స్టేషన్‌ మేనేజర్‌ ఎం.రవిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా లిఫ్టు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. స్టేషన్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎస్కలేటర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని