logo

కూటమి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం

వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎంపీˆ రామ్మోహన్‌నాయుడు అన్నారు. 

Published : 09 May 2024 04:28 IST

పాతపట్నంలో మాట్లాడుతున్న ఎంపీˆ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పక్కన మామిడి గోవిందరావు
పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎంపీˆ రామ్మోహన్‌నాయుడు అన్నారు.  హిరమండలం మండలం గొట్ట గ్రామం నుంచి పాతపట్నం మీదుగా మెళియాపుట్టి మండలం శివారు గొప్పిలి వరకు కూటమి శ్రేణుల ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాతపట్నం చేరుకున్న ఎంపీˆ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత అగ్నిమాపక కేంద్రం, కళాశాలలు, వైద్యశాలలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ ప్రజలందరూ ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. భాజపా, జనసేన నాయకులు సలాన శరత్‌కుమార్‌, గేదెల చైతన్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని