అభివృద్ధి అన్నారు.. అ‘శాంతి’ మిగిల్చారు..!
ఉత్తరాంధ్రలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. శాంతమ్మ చెబితే శాసనమేనని ప్రజలూ నమ్మారు.
గత హామీలతోనే పాతపట్నం నుంచి మళ్లీ బరిలోకి
ఐదేళ్లలో ఏం చేశారని ప్రజల నుంచి ప్రశ్నల వర్షం
ఉత్తరాంధ్రలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. శాంతమ్మ చెబితే శాసనమేనని ప్రజలూ నమ్మారు. ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయిదేళ్లు గడిచినా ఎలాంటి మార్పూ కనిపించలేదు. గత హామీలనే మరోసారి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తుండటంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఏం చేశారు.. మరోసారి అధికారం కట్టబెట్టడానికి’ అని నిలదీస్తుండటంతో అక్కడి నుంచి జారుకుంటున్నారు.
- ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్టుడే, పాతపట్నం
ఆశ పెట్టారు..విస్మరించారు
హామీ: జిల్లేడుపేట గ్రామం వద్ద మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మిస్తాం.
ప్రస్తుత పరిస్థితి: వైకాపా అధికారంలోకి రాగానే జిల్లేడుపేట వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఏళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నాటు పడవపై ప్రయాణిస్తున్నారు.
చుక్క నీరివ్వలేకపోయారు..
హామీ: వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.
ప్రస్తుత పరిస్థితి: తెదేపా హయాంలోనే వంశధార ప్రాజెక్టు పనులు 87 శాతం జరిగాయి. వైకాపా అయిదేళ్ల పాలనలో 97 శాతం వరకు చేయగలిగారు. మిగిలిన పనులు పూర్తి చేయలేకపోవడంతో చుక్కనీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కాలువల ద్వారా సుమారు 2.57 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నా సాధ్యపడలేదు. వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరందిస్తాం.
గిరిజనులను వదిలేశారు..
హామీ: పెద్దమడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తాం.
ప్రస్తుత పరిస్థితి: జగన్ పాదయాత్రలో మెళియాపుట్టి మండలం పెద్దమడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తామన్నారు. అది సాకారం చేసే బాధ్యతను ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీసుకోలేదు. గతి లేక గిరిజన ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక వైద్యానికి సైతం భారీగా ఖర్చు అవుతుండటంతో ఆమె తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రహదారులు ఎక్కడ?
హామీ: గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు, తారు రోడ్లు నిర్మిస్తాం.
ప్రస్తుత పరిస్థితి: పాతపట్నం మండలంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం కిమిడి-రుగడ రహదారి కీలకమైంది. పలు గిరిజన గ్రామాలను కలుపుతూ పాతపట్నం, కొత్తూరు, హిరమండలం మండలాలను అనుసంధానం చేస్తుంది. అయిదేళ్ల కిందట టెండరు వేసినప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నిధులు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రావట్లేదు. మెళియాపుట్టి మండలంలో గిరిజన ప్రాంతాలైన గొడ్డ ఆంపురం, చందనగిరి, మదనాపురం, నేలబొంతు-భీంపురం రోడ్డు, కూరాసింగిగూడ, హడ్డివాడ తదితర రహదారులు నిర్మాణం చేపట్టలేదు. కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
కలగానే కళాశాల ఏర్పాటు..
హామీ: మెళియాపుట్టిలో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం.
ప్రస్తుత పరిస్థితి: జగన్ పాదయాత్రలో మెళియాపుట్టి మండలం పెద్దమడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తామన్నారు. అది సాకారం చేసే బాధ్యతను ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీసుకోలేదు. గతి లేక గిరిజన ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక వైద్యానికి సైతం భారీగా ఖర్చు అవుతుండటంతో ఆమె తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి: అయిదేళ్లు గడిచినా కళాశాల మంజూరు విషయమే పట్టించుకోలేదు. బాలికలు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లి విద్య అభ్యసిస్తున్నారు.
ఇవి కూడా చేయలేదు..
- కడగండి రిజర్వాయర్ నుంచి ఎల్ఎన్పేట మండలానికి కాలువలు నిర్మిస్తామని చెప్పారు. ఆ పనులూ చేయకపోవడంతో ఖరీఫ్, రబీ సీజన్లలో నీరు రిజర్వాయర్ ద్వారా వృథాగా బయటకు వెళ్లిపోతుంది. నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ సైతం నెరవేర్చలేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు నష్ట తీవ్రత పెరుగుతోంది.
- వంశధార నదికి వరద వస్తే కొత్తూరు మండల పరిధిలో పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు వర్షాల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..