ఉత్పత్తుల ఎగుమతికి ప్రత్యేక కేంద్రం
నీలగిరి జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతి చేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. నీలగిరి జిల్లా ఊటీ 200వ ఏడాది ఉత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శనివారం జరిగింది. సీఎం పాల్గొన్నారు.
నీలగిరిలో ఏర్పాటుకు చర్యలు
ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడి
పలు పథకాలకు ప్రారంభోత్సవం
వీసీ ద్వారా పథకాలను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
ఊటీ ఏర్పడి 200 ఏళ్లు అవుతున్న సందర్భంగా దీని అభివృద్ధికి కృషి చేసిన జాన్ సులివన్ జ్ఞాపకార్థకంగా ఉదగై తావరవియల్ పార్క్కు వెళ్లే మార్గంలో రూ.20లక్షల ఖర్చుతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. వేడుకలకు ప్రభుత్వం రూ.10కోట్లు కేటాయించారు.
పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక వైద్య పరీక్షల కేంద్రాన్ని నీలగిరి జిల్లా దొడ్డబెట్టా పంచాయతీ ముత్తోర బాలల కేంద్రంలో స్టాలిన్ ప్రారంభించారు. జిల్లాలలో ఈ కార్యక్రమం నెలపాటు జరుగుతుంది. పిల్లలను గుర్తించి వారి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వివరాలు ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసి పర్యవేక్షిస్తారు. కార్యక్రమాల్లో మంత్రులు స్వామినాథన్, రామచంద్రన్, ఎంపీ ఎ.రాజా, నీలగిరి కలెక్టర్ అమ్రిత్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్