‘జనని’ సేవలు ఆదర్శనీయం
జనని సాంఘిక సాంస్కృతిక సమితి తెలుగు కళామతల్లికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది ఏఎన్ పురుషోత్తం అభివర్ణించారు. ‘జనని’ రజతోత్సవాలు మైలాపూరు ఆంధ్ర మహిళాసభలోని డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటినరీ హాలులో శనివారం రాత్రి వైభవంగా జరిగాయి.
పుస్తకావిష్కరణలో అతిథులు, నిర్వాహకులు
చెన్నై (సాంస్కృతికం), న్యూస్టుడే: జనని సాంఘిక సాంస్కృతిక సమితి తెలుగు కళామతల్లికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది ఏఎన్ పురుషోత్తం అభివర్ణించారు. ‘జనని’ రజతోత్సవాలు మైలాపూరు ఆంధ్ర మహిళాసభలోని డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటినరీ హాలులో శనివారం రాత్రి వైభవంగా జరిగాయి. ముందుగా డాక్టర్ నిర్మలా పళనివేలు అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో ‘జనని’ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతం పలుకుతూ సంస్థ పాతికేళ్ల ప్రస్థానం, దాతల సహకారం గురించి సంక్షిప్తంగా వివరించారు. సంస్థ ప్రత్యేక సంచికను పురుషోత్తం ఆవిష్కరించారు. తొలి ప్రతిని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబుకు అందజేశారు. అనంతరం ప్రసంగిస్తూ తెలుగు భాషపై మక్కువతో పాతికేళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో పుస్తకాలను ప్రచురించిన ‘జనని’ సేవలు అనన్య సామాన్యమన్నారు. భవిష్యత్తులో స్వర్ణోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్వీకర్త తమ్మినేని బాబు మాట్లాడుతూ ‘జనని’తో తమ సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుకు తెచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు తన అభినందనలు తెలిపారు. దాతల సహాయసహకారాలతో ఓ వైపు కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు పలువురి రచనలను ముద్రించిన ఘనత జననికే చెందుతుందన్నారు. రజతోత్సవ సంచిక సంపాదకుడు డాక్టర్ ఉప్పలధడియం వెంకటేశ్వర మాట్లాడుతూ దాదాపు 40 మంది రచయితలు ఈ సంచికకు వ్యాసాలు పంపారని తెలిపారు. వసుంధరాదేవి ‘మా తెలుగుతల్లి’ ప్రార్థనతో మొదలైన కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది. నగరంలోని తెలుగు ప్రముఖులు అనేకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్ట్రాంగ్’గా ఉన్నట్టేనా?
[ 04-05-2024]
తెన్కాశి పార్లమెంటులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 210 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే 90 పనిచేయట్లేదని తేలింది. -
ఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం
[ 04-05-2024]
కంచి కామకోటి పీఠం ప్రాంగణంలోని ఆదిశంకరుడు, శ్రీ అనుక్కై గణపతి, సురేశ్వరాచార్యుల సన్నిధులకు ఇటీవల జీర్ణోద్ధరణ చేపట్టారు. -
ఎండ నుంచి ఉపశమనానికి గ్రీన్ నెట్స్
[ 04-05-2024]
ఎండలు భగ్గుమంటుండంతో వాహన చోదకులు సిగ్నళ్ల వద్ద నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కోవై, తిరుప్పూర్ కార్పొరేషన్ల తరఫున తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేశారు. -
విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు
[ 04-05-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ స్మారక ప్రదేశానికి ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘కెప్టెన్’ అనారోగ్యంతో గతేడాది డిసెంబరులో మృతి చెందగా కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెరిగిన విమాన సర్వీసులు
[ 04-05-2024]
వేసవి రద్దీతో నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు ముగిసి సెలవులు ప్రకటించడంతో అనేక మంది కుటుంబాలతో కలిసి సెలవులు గడిపేందుకు వెళ్తున్నారు. -
నీళ్లట్యాంకులో మలం కలిపారని వదంతులు
[ 04-05-2024]
రాణిపేట సమీపం నౌలాక్ పంచాయతీ సిప్కాట్ వద్ద ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాల సమీపంలో లక్ష లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకు ఉంది. -
ఎలక్షన్ రెండో సింగిల్ విడుదల
[ 04-05-2024]
‘ఉరియడి’, ‘ఫైట్ క్లబ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు విజయకుమార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఎలక్షన్’. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఎలక్షన్’ అనే టైటిల్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. -
ఊటీలో 10 రోజులపాటు పుష్ప ప్రదర్శన
[ 04-05-2024]
ఊటీలో మొదటిసారిగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు నీలగిరి కలెక్టర్ అరుణ తెలిపారు. -
వీఐటీ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి 3వ స్థానం
[ 04-05-2024]
వేలూర్ వీఐటీ విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరానికిగాను ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఇటీవల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM